యాప్నగరం

రెండో పెళ్లి చేసుకున్న భర్త.. కోపంతో దారుణానికి ఒడిగట్టిన భార్య

భర్త రెండో పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. కోపంతో అతడి ప్రైవేట్ పార్ట్‌ని కోసేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ సమీపంలో ఈ దారుణం జరిగింది.

Samayam Telugu 2 Aug 2018, 1:54 pm
భర్త రెండో పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. కోపంతో అతడి ప్రైవేట్ పార్ట్‌ని కోసేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ సమీపంలో ఈ దారుణం జరిగింది. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. నిమాల్నాకు చెందిన వ్యక్తికి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్యకు పిల్లలు కలగకపోవడంతో మరో పెళ్లి చేసుకున్నాడు. ఈ మధ్యే రెండో భార్య కు బిడ్డ పుట్టాడు. కొంతకాలంగా భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆమె కోపం పెంచుకుంది. భర్తపై ఎలాగైనా పగను తీర్చుకోవాలని భావించింది.
Samayam Telugu wife


మాయ మాటలు చెప్పి భర్తను పిలిపించింది. కత్తి తీసుకొని అతడి జననేంద్రియాలను కోసేసింది. తీవ్రంగా గాయపడిన బాధితుడ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అతడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే మొదటి భార్య సమ్మతితోనే అతడు రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితురాలిని అరెస్ట్ చేశారు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.