యాప్నగరం

Newborn: మహిళ పెద్ద మనసు.. చెత్త కుప్పలో దొరికిన చిన్నారికి సగం ఆస్తి

Newborn మానవత్వం మరిచిపోయిన ఓ తల్లి తనకు పుట్టిన బిడ్డను చెత్త కుప్పలో పడేసింది. ఆ తల్లికి భారమైన శిశువును చెత్తకుప్పలో నుంచి బటయకు తీసి ఓ మహిళ అక్కున చేర్చుకుంది. అంతటితో ఆగకుండా ఆ చిన్నారిని దత్తత తీసుకుంటానని ప్రకటించి.. సగం ఆస్తిని రాసి ఇవ్వడానికి సిద్ధమైంది. మానవత్వం పరిమళించిన ఈ ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌‌లోని అలీగఢ్ జిల్లాలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ఆ మహిళ పెద్ద మనసును అభినందిస్తున్నారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 18 Apr 2023, 10:30 am

ప్రధానాంశాలు:

  • నవజాత శిశువును చెత్తకుప్పలో విసిరేసిన మహిళ
  • చిన్నారిని అక్కున చేర్చుకున్న మరో మాతృమూర్తి
  • చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇచ్చిన పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Newborn
ఏ తల్లికి భారమైందో ఏమో అప్పుడే పుట్టిన శిశువును చెత్తకుప్పలో విసిరేసింది. అటుగా వెళ్తోన్న ఓ మహిళ చెవిలో ఆ బిడ్డ ఏడుపు పడింది. చెత్త కుప్పలో శిశువును చూసిన ఆమె.. అక్కున చేర్చుకుంది. అంతేకాదు, ఆ పసిగుడ్డను దత్తత తీసుకుని తన సగం ఆస్తిని రాసిచ్చేందుకు ముందుకొచ్చింది. మానవత్వం పరిమళించిన ఈ ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌‌లోని అలీగఢ్ జిల్లాలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. అలీగఢ్ స్వర్ణ జయంతి నగర్‌ ఎంప్లాయీ కాలనీలో నివాసం ఉండే లత అనే మహిళ.. సోమవారం ఉదయం పాల కోసం దుకాణానికి వెళ్లింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. గేటు వద్ద ఉన్న ఓ చెత్త కుప్పలో నుంచి చిన్నారి ఏడుస్తున్నట్లుగా శబ్దాలు వినిపించాయి.
ఆమె దగ్గరకు వెళ్లి చూడగా ఓ నవజాత శిశువు కనిపించింది. దీంతో వెంటనే బిడ్డను చేతుల్లోకి తీసుకొని చుట్టుపక్కల వారందరినీ ఆరా తీసింది. ఆ బిడ్డ ఎవరో తమకు తెలియదని వారు చెప్పడంతో ఆ శిశువును తన ఇంటికి తీసుకెళ్లింది. చిన్నారికి శుభ్రంగా స్నానం చేయించి పాలు పట్టింది. బిడ్డను దత్తత తీసుకొని, తన పేరు మీద ఉన్న ఆస్తిలో సగం ఇప్పుడే పాప పేరు మీద రాయాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు లత పెద్ద మనసును అభినందించారు. చిన్నారి విషయం పోలీసులకు తెలియడంతో వారు చైల్డ్‌ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇచ్చారు.

దీనిపై లత మాట్లాడుతూ.. సోమవారం ఉదయం పాల ప్యాకెట్ల కోసం వెళ్తుండగా.. గేటు వద్ద ఉన్న చెత్త కుండిలో నుంచి ఓ పసిపాప ఏడుపు వినిపించిందని తెలిపింది. అక్కడకు వెళ్లి చూడగా నవజాత శిశువు కనిపించిందని, చుట్టుపక్కల వారిని అడిగితే తమకు తెలియదన్నారని పేర్కొంది. బిడ్డను ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించి పాలు పట్టి నిద్రిపుచ్చానని చెప్పింది. దత్తత తీసుకుని, తన పేరున ఉన్న సగం ఆస్తిని ఇస్తానని వెల్లడించింది.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.