యాప్నగరం

పేదరికం.. చిన్నారికి విషమిచ్చి చంపిన తల్లి

Chennai: కరోనా సంక్షోభంతో పేదరికం మరింత తీవ్రమైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఆ తల్లి కఠినమైన నిర్ణయం తీసుకుంది. చెన్నలో చోటు చేసుకున్న విషాద ఘటన వివరాలు..

Samayam Telugu 12 Oct 2020, 12:54 am
సలే పేదరికం. కరోనా సంక్షోభం వారి జీవితాలను మరింత వెక్కిరించింది. దీంతో ఆ మహిళ ఏ తల్లీ చేయకూడని పని చేసింది. కన్నప్రేమను చంపుకొని, పేగు తెంచుకొని పుట్టిన బిడ్డకు పాలల్లో విషం కలిపి తాగించింది. దీంతో చిన్నారి ప్రాణం గాల్లో కలిసిపోయింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారించిన పోలీసులు ఆ మహిళ చేసిన దారుణాన్ని బయటపెట్టారు. ఆమెను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. తమిళనాడులోని విల్లుపురంలో ఈ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Woman kills 5 months old child in Chennai


విల్లుపురం పాపానకుళం ప్రాంతానికి చెందిన సాధిక్‌ బాషా (35) ప్రైవేటు బస్‌ కండక్టర్‌‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి భార్య యాస్మిన్‌ (28), కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా బస్సులు తిరగకపోవడంతో సాధిక్‌ బాషా పనిలేక ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో వారి కష్టాలు రెట్టింపయ్యాయి.

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తమకు ముగ్గురు పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టడం కష్టం అవుతుందని యాస్మిన్ భావించింది. దీంతో కఠిన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 28న ఐదు నెలల చిన్నారికి యాస్మిన్‌ పాలుపట్టి పడుకోబెట్టింది. మరుసటి రోజున బిడ్డ మృతి చెందింది. సాదిక్‌ బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు విల్లుపురం వెస్ట్‌ పోలీసులు విచారణ జరిపారు. గురువారం వచ్చిన పోస్టుమార్టం నివేదికలో బిడ్డకు పాలలో విషమిచ్చి చంపినట్లు తేలింది. దీంతో ఆ బిడ్డ తల్లి యాస్మిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Also Read: కరోనా వైరస్ చైనాలో పుట్టలేదట.. నిజంగా షాకింగే!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.