యాప్నగరం

కూతురిపై కన్నేసాడని... ప్రియుడి హత్య...!

తనతో వివాహేతర సంబంధం పెట్టుకొని... తన కూతురితో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రియుడిని హతమార్చింది... ఓ మహిళ. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

TNN 30 Mar 2018, 2:48 pm
తనతో వివాహేతర సంబంధం పెట్టుకొని... తన కూతురితో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రియుడిని హతమార్చింది... ఓ మహిళ. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎలిగెంట్‌ కంపెనీలో వడ్రంగిగా పని చేస్తున్న రఘు, ఒక దుస్తుల పరిశ్రమలో పనిచేసే రూపకు మధ్య మొదలైన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. రఘు అవివాహితుడు కాగా, రూపకు వివాహమై... ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరిద్దరూ... గుట్టుచప్పుడు కాకుండా తమ అక్రమసంబంధాన్ని కొనసాగించారు.
Samayam Telugu murder


కొన్నిరోజుల తర్వాత... మధుమేహ వ్యాధి బారిన పడిన... రూప ఇంటికే పరిమితమైంది. భర్త ఇంట్లో లేని సమయంలో... రఘు ఆమె ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఆమె కుమార్తె (13)ను లైంగికంగా వేధించేవాడు. ఈ విషయం గురించి... పలుమార్లు గుర్తించి అడ్డుకుంది. ఇదే విషయమై అతనితో గొడవకు దిగేది. రెండు రోజుల క్రితం రూప ఇంటికి వచ్చిన రఘు... ఆమె కుమార్తెతో మళ్లీ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహించిన మహిళ... తినడానికని తీసుకెళ్లి... రాగి ముద్దలో మత్తుమందు కలిపి ఇచ్చింది. రఘు నిద్రలోకి జారుకోగానే... తాళ్లతో కట్టేసి... విపరీతంగా కొట్టింది. కత్తితో పొట్టలో పొడిచి... గొంతు కోసి చంపేసింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇరుగుపొరుగువారికి చెప్పింది. భర్తతో జరిగిన విషయం చెప్పి.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.