తన కడుపున పుట్టిన కొడుకునే భార్య వివాహం చేసుకుందని ఆరోపిస్తూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంచలన ఘటన ఉత్తరాఖండ్లో చోటుచేసుకుంది. ఉధమ్సింగ్ నగర్ జిల్లా బాజ్పూర్ ప్రాంతానికి చెందిన ఓ మధ్య వయస్కుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కథనం ప్రకారం.. బాజ్పూర్కు చెందిన ఇంద్రరామ్ అనే వ్యక్తి... తన భార్య బాబ్లీ కుమారుడిని పెళ్లాడిందని ఫిర్యాదు చేశారు. తన భార్యకు గతంలోపెళ్లి కావడంతో మొదటి భర్త ద్వారా ఇద్దరు కుమారులకు జన్మనిచ్చిందని సదరు వ్యక్తి పేర్కొన్నాడు. అతడికి విడాకులిచ్చిన బాబ్లీ తనను రెండో వివాహం చేసుకుందని తెలిపాడు. 11 ఏళ్ల కిందట మాకు పెళ్లి జరిగిందని, ముగ్గురు పిల్లలు ఉన్నారని చెప్పాడు. తర్వాత బాబ్లీ తన మొదటి భర్త వల్ల పుట్టిన కొడుకుల్లో ఒకరి ఇంటికి ఇటీవల వెళ్లడం ప్రారంభించిందని పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో ఇంద్రరామ్ పేర్కొన్నాడు. ఈ క్రమంలో అతడికి దగ్గరయిన బాబ్లీ.. తనను వదిలేసి ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపాడు. బాబ్లీ, ఆమె కుమారుడు పెళ్లి చేసుకున్నారని అతడు ఆరోపించాడు. అంతేకాదు, తన ఇంట్లో ఉన్న రూ.20వేలు నగదు ఎత్తుకెళ్లిపోయిందని ఫిర్యాదు చేశాడు.
తనను మోసం చేసిన ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఇవి కేవలం ఆరోపణాలేనా? వాస్తవంగా జరిగిందా? అనేది తెలియాల్సి ఉందని పోలీసులు వ్యాఖ్యానించారు. విచారణలో అన్ని అంశాలూ బయటకొస్తాయని వారు చెప్పారు.
తనను మోసం చేసిన ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఇవి కేవలం ఆరోపణాలేనా? వాస్తవంగా జరిగిందా? అనేది తెలియాల్సి ఉందని పోలీసులు వ్యాఖ్యానించారు. విచారణలో అన్ని అంశాలూ బయటకొస్తాయని వారు చెప్పారు.