యాప్నగరం

టిఫిన్ వండలేదని భర్త ఆగ్రహం.. మనస్తాపంతో భార్య ఆత్మహత్య

భర్త తిట్టాడని క్షణికావేశంలో వివాహిత ఆత్మహత్య..

Samayam Telugu 11 Oct 2018, 3:56 pm
చిన్న, చిన్న కారణాలు ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. పక్కింటోళ్లు నవ్వారని.. భర్త తిట్టాడని.. నలుగురిలో అవమానం ఎదురయ్యిందని.. ఇలా కారణమేదైనా క్షణికావేశంలో నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు కొందరు అమాయకులు. తాజాగా బెంగళూరులోనూ అదే జరిగింది. టిఫిన్ వండలేదని భర్త తిట్టడంతో.. మనస్తాపం చెందిన మహిళ ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె చనిపోవడంతో.. ఇద్దరు పిల్లలు తల్లిలేని వారిగా మిగిలారు.
Samayam Telugu Suicide


తమిళనాడుకు చెందిన ధనయుదం అనే వ్యక్తి ఉద్యోగ రీత్యా భార్య అంజలితో కలిసి బెంగళూరులోని కదిరెన హళ్లిలో నివాసం ఉంటున్నాడు. వారికి ఇద్దరు సంతానం. పిల్లలిద్దరూ ఉదయాన్నే స్కూల్‌కు వెళుతుండటంతో.. అంజలి వారికి టిఫిన్ బాక్స్ పంపేది. అయితే మంగళవారం ఉదయం కాస్త ఆలస్యంగా నిద్ర లేచింది. పిల్లలకు టిఫిన్ కూడా సిద్ధం చేయలేదు. దీంతో భర్త ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. టిఫిన్ ఎందుకు వండలేదంటూ కోపగించుకున్నాడు. తర్వాత భర్త ఆఫీస్‌కు.. పిల్లలిద్దరూ స్కూల్‌కు వెళ్లిపోయారు.

భర్త ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. అంజలి మనస్తాపం చెందింది. ఇంట్లో ఎవరి లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. సాయంత్రం ఆఫీస్ నుంచి తిరిగొచ్చిన భర్త.. గదిలో ఫ్యాన్‌కు వెళాడుతున్న అంజలిని చూసి షాక్ తిన్నాడు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంజలి క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడంతో.. ఇద్దరు పిల్లలు అమ్మ ప్రేమకు దూరమయ్యారు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.