యాప్నగరం

కశ్మీర్‌లో మహిళను కాల్చిచంపిన ఉగ్రమూకలు!

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. పుల్వామా జిల్లా కాకపొరా ప్రాంతంలోని నర్బాల్ గ్రామంలో ఓ మహిళపై కాల్పులకు తెగబడ్డారు.

Samayam Telugu 5 Jun 2019, 1:15 pm
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. పుల్వామా జిల్లా కాకపొరా ప్రాంతంలోని నర్బాల్ గ్రామంలో ఓ మహిళపై కాల్పులకు తెగబడ్డారు. ఇంట్లో ఉన్న మహిళతోపాటు మరో యువకుడుపై ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన వీరిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో ఆ మహిళ మృతి చెందింది. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతోన్న యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఉగ్రకాల్పుల్లో మృతి చెందిన మహిళను నైజీనా బానో, యువకుడిని మహ్మద్ సుల్తాన్‌గా గుర్తించినట్టు ఓ పోలీస్ అధికారి తెలిపారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మహిళపై కాల్పులు ఎందుకు జరిపారు? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
Samayam Telugu terrorists


మరోవైపు, శ్రీనగర్‌లో అల్లరిమూకలు రెచ్చిపోయాయి. లష్కరే తొయిబా, జేషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా బ్యానర్లు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. అప్రమత్తమైన భద్రతా దళాలు అల్లరిమూకలను చెదరగొట్టారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.