యాప్నగరం

ఆమెకు 29,అతడికి 15 ఏళ్లు.. ఇంట్లో నుంచి ఇద్దరూ జంప్

పదో తరగతి పిల్లాడిని తీసుకొని 29 ఏళ్ల స్కూల్ టీచర్ వెళ్లిపోయింది. రెండు రోజుల పాటూ ఎవరికి దొరక్కుండా ఇద్దరూ చెట్టపట్టాలేసుకొని తిరిగారు. చివరికి విద్యార్థి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు ఆ పంతులమ్మను అరెస్ట్ చేశారు.

Samayam Telugu 24 Jul 2018, 4:08 pm
పదో తరగతి పిల్లాడిని తీసుకొని 29 ఏళ్ల స్కూల్ టీచర్వెళ్లిపోయింది. రెండు రోజుల పాటూ ఎవరికి దొరక్కుండా ఇద్దరూ చెట్టపట్టాలేసుకొని తిరిగారు. చివరికి విద్యార్థి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు ఆ పంతులమ్మను అరెస్ట్ చేశారు. హర్యానాలోని ఫతేబాద్‌లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. పట్టణానికి చెందిన 15ఏళ్ల బాలుడు స్థానికంగా ఉన్న స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్నాడు. అక్కడే పనిచేస్తున్న టీచర్‌.. ఆ పిల్లవాడిపై మనసు పారేసుకుంది. అతడికి మాయ మాటలు చెప్పి మెల్లిగా ట్రాప్‌లో పడేసింది. రోజూ ఫోన్‌లో మాట్లాడకుంటూ.. సోషల్ మీడియా ద్వారా కూడా టచ్‌లో ఉన్నారు.
Samayam Telugu Teacher


కొద్ది రోజులుగా ఈ పంతులమ్మ-విద్యార్థి మధ్య ఈ వ్యవహారం నడుస్తోంది. అయితే గత శుక్రవారం టీచరమ్మ పిల్లవాడికి ఫోన్ చేసింది. ఇంట్లో నుంచి జంపైపోదామని చెప్పింది. అతడు కూడా సై అనడంతో ఇద్దరూ వెళ్లిపోయారు. రాత్రైనా బాలుడు ఇంటికి రాకపోవడంతో తండ్రి కంగారుపడ్డాడు. తన కుమారుడు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు స్కూల్లో ఆరా తీశారు. అప్పుడు కాని అసలు వ్యవహారం బయటపడలేదు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఈ జంట ఎక్కడుందో గుర్తించారు. సోమవారం నాడు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్ విధించారు. ఈ జంట ముందుగా ఢిల్లీ వెళ్లారు. అక్కడి నుంచి జమ్మూకాశ్మీర్‌లోని ఖత్రా వెళ్లినట్లు గుర్తించారు. అక్కడ అదుపులోకి తీసుకొని ఫతేబాద్ తీసుకొచ్చారు. వీళ్లద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని భావించారట. ఈలోపే పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.