కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలోని లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. కాంగ్రెస్ తీరు బాధిస్తోందని సీఎం కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోను ఆ పార్టీ నేతలు జోక్యం చేసుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ తీరుతో తాను సీఎంలా కాకుండా.. క్లర్క్లా పని చేయాల్సి వస్తోందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. జేడీఎస్ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో ఆయన తన బాధనంతా వెళ్లగక్కారు. సమావేశం తర్వాత కొంత మంది ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాలు తెలిపారు. కాంగ్రెస్ నేతలు తనను వాళ్ల కింద పని చేసే వ్యక్తిగా చూస్తున్నారని సీఎం కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేసినట్లు జేడీఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. వారు తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలంటూ సీఎంపై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారని.. ఆయనకు కూడా వేరే దారి లేక వాళ్లు చెప్పినట్లుగా చేయాల్సి వస్తుందని తెలిపారు.
‘ఆయన చాలా బాధపడుతున్నారు. ఏడ్చినంత పని చేశారు. తమ కంటే పెద్ద అన్నట్లుగా కాంగ్రెస్ వాళ్లు ప్రవర్తిస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల ఆదేశాలపై సీఎంతో బలవంతంగా సంతకాలు చేయిస్తున్నారు. కాంగ్రెస్ తీరుతో ప్రతి రోజు ఆయనకు చాలా కష్టంగా గడుస్తోంది’ అని జేడీఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు.
కేబినెట్ను విస్తరించమని కాంగ్రెస్ నేతలు ఒత్తిడి చేస్తున్నట్లు సీఎం తెలిపారని జేడీఎస్ ఎమ్మెల్యేలు చెప్పారు. ప్రభుత్వ ఆధీనంలో నడిచే సంస్థలకు ఛైర్పర్సన్ నియామకాలు చేపట్టేందుకు కూడా కాంగ్రెస్ అనుమతి కావాలంటూ సీఎం ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు.
అయితే.. సమావేశానికి హాజరైన జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ వేచి చూసే ధోరణితో వ్యవహరిద్దామని నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలు జరిగేంత వరకు వేచి చూడాలని తన కుమారుడు, సీఎం కుమారస్వామితో పాటు పార్టీ నేతలకు ఆయన చెప్పినట్లు సమాచారం.
ఆది నుంచే లుకలుకలు..
కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు బయటకిరావడం ఇదే తొలిసారేం కాదు. ప్రభుత్వం ఏర్పాటు చేసి వారం తిరగక ముందే ఇలాంటి వార్తలు బయటకొచ్చాయి. కాంగ్రెస్ నేతల తీరు పట్ల సీఎం కుమారస్వామి పలుమార్లు ఆవేదన చెందారు. తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ మాజీ సీఎం సిద్ధరామయ్య జోక్యం చేసుకుంటున్నారని.. గరళాన్ని మింగిన శివుడిలా తన పరిస్థితి మారిందని కుమారస్వామి గతంలో ఆవేదన చెందినట్లు వార్తలు వచ్చాయి. ఈ అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా జోక్యం చేసుకొని రాహుల్ గాంధీతో మాట్లాడి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నాలు చేసినట్లు వార్తలొచ్చాయి.
‘ఆయన చాలా బాధపడుతున్నారు. ఏడ్చినంత పని చేశారు. తమ కంటే పెద్ద అన్నట్లుగా కాంగ్రెస్ వాళ్లు ప్రవర్తిస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల ఆదేశాలపై సీఎంతో బలవంతంగా సంతకాలు చేయిస్తున్నారు. కాంగ్రెస్ తీరుతో ప్రతి రోజు ఆయనకు చాలా కష్టంగా గడుస్తోంది’ అని జేడీఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు.
కేబినెట్ను విస్తరించమని కాంగ్రెస్ నేతలు ఒత్తిడి చేస్తున్నట్లు సీఎం తెలిపారని జేడీఎస్ ఎమ్మెల్యేలు చెప్పారు. ప్రభుత్వ ఆధీనంలో నడిచే సంస్థలకు ఛైర్పర్సన్ నియామకాలు చేపట్టేందుకు కూడా కాంగ్రెస్ అనుమతి కావాలంటూ సీఎం ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు.
అయితే.. సమావేశానికి హాజరైన జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ వేచి చూసే ధోరణితో వ్యవహరిద్దామని నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలు జరిగేంత వరకు వేచి చూడాలని తన కుమారుడు, సీఎం కుమారస్వామితో పాటు పార్టీ నేతలకు ఆయన చెప్పినట్లు సమాచారం.
ఆది నుంచే లుకలుకలు..
కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు బయటకిరావడం ఇదే తొలిసారేం కాదు. ప్రభుత్వం ఏర్పాటు చేసి వారం తిరగక ముందే ఇలాంటి వార్తలు బయటకొచ్చాయి. కాంగ్రెస్ నేతల తీరు పట్ల సీఎం కుమారస్వామి పలుమార్లు ఆవేదన చెందారు. తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ మాజీ సీఎం సిద్ధరామయ్య జోక్యం చేసుకుంటున్నారని.. గరళాన్ని మింగిన శివుడిలా తన పరిస్థితి మారిందని కుమారస్వామి గతంలో ఆవేదన చెందినట్లు వార్తలు వచ్చాయి. ఈ అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా జోక్యం చేసుకొని రాహుల్ గాంధీతో మాట్లాడి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నాలు చేసినట్లు వార్తలొచ్చాయి.