యాప్నగరం

నోట్లరద్దుతో ఆర్థిక ప్రగతికి మేలు: వరల్డ్ బ్యాంక్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న పెద్దనోట్లరద్దు నిర్ణయం వల్ల అవినీతిని అంతమొందించడంతోపాటు

Samayam Telugu 2 Mar 2017, 6:42 pm
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న పెద్దనోట్లరద్దు నిర్ణయం వల్ల అవినీతిని అంతమొందించడంతోపాటు భారత ఆర్థిక వ్యవస్థ ప్రగతికి అత్యంత మేలు ఒనగూరుతుందని ప్రపంచ బ్యాంకు సీఈవో క్రిస్టలినా జార్జీవా అన్నారు.
Samayam Telugu world bank ceo says note ban decision will positively impact economy
నోట్లరద్దుతో ఆర్థిక ప్రగతికి మేలు: వరల్డ్ బ్యాంక్


రెండు రోజుల పాటు ఆమె భారత పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె ముంబైలోని మురికివాడ ధారవిలో పర్యటించారు. అక్కడ నివసిస్తున్న ప్రజల జీవన స్థితిగతులపై చర్చించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...నగదుతో నివసిస్తున్న సమాజం అయినందువల్ల నోట్లరద్దుతో ప్రజలకు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కానీ..ధీర్ఘకాలంలో ఎన్నో మేళ్లున్నాయన్నారు. నోట్లరద్దు డిజిటల్ ఎకానమీకి అడుగులు పడేలా చేస్తుందని ఆమె గుర్తు చేశారు.

యూరోపియన్ యూనియన్ సైతం పెద్దనోట్లతో సతమతవుతుందని ఆమె గుర్తు చేశారు.
‘‘నోట్లరద్దును ఇతర దేశాలతో పోల్చి చూస్తే ఇంత పెద్ద దేశంలో జరిగినట్లు ఎక్కడా జరగలేదు. కానీ దీని వల్ల ఎన్నో సంస్కరణలు జరుగుతాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి కార్యక్రమాలతో లాభాలున్నాయి. గ్లోబల్ ఎకానమీలో ఇండియాకు ఉజ్వల భవిష్యత్ ఉంది’’ అని ఆమె పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.