ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ సంస్కృతి ఉత్సవంపై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ తరహా కార్యక్రమాల వల్ల భారతదేశ పర్యాటక రంగానికి మరింత ఊపు లభిస్తుందన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని యమునా తీరాన ప్రపంచ సంస్కృతి ఉత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం ప్రధాని మోడీ ప్రారంభించారు. దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు, సాంస్కృతిక ప్రతినిధులు ఈ ఉత్సవానికి తరలి రాగా, లక్షలాదిగా ప్రజలు ఉత్సవ ప్రాంగణానికి పోటెత్తి వస్తున్నారు. శనివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మహేశ్ శర్మ మాట్లాడుతూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు రవిశంకర్ గురూను అభినందించారు. ప్రజల్లో ఆధ్యాత్మిక భావనలు పెంచి, దేశ సంస్కృతి సౌరభాలను దశ దిశలా వ్యాప్తి చేయడానికి ప్రపంచ సంస్కృతి ఉత్సవం ఉపకరిస్తుందన్నారు.
సంస్కృతి ఉత్సవంతో టూరిజానికి ఊపు
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ సంస్కృతి ఉత్సవంపై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ ప్రశంసల వర్షం కురిపించారు.
TNN 12 Mar 2016, 6:26 pm