Wrestlers Protest: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన మరోసారి తెరపైకి వచ్చింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. తాజాగా.. ఆదివారం రెజ్లర్లు కీలక ప్రకటన చేశారు. సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్ మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. 22 రోజులైంది.. ఇప్పటి వరకు బీజేపీ (BJP) నుంచి ఎవరూ తమ వద్దకు రాలేదని వివరించారు. ఒలింపిక్ విజేత సాక్షి మాలిక్ మాట్లాడుతూ.. బీజేపీ మహిళా ఎంపీల సాయం కోరుతూ లేఖ రాస్తామన్నారు. ఆ లేఖను వారి ఇళ్లకు అందజేస్తామని చెప్పారు. సమాజంలోని ప్రజలందరి మద్దతు అవసరం అని స్పష్టం చేశారు. తాము చేస్తున్న ఆరోపణలు నిజమేనని.. అందుకే అందరూ మద్దతుగా రావాలని కోరారు. మంగళవారం ప్రజలంతా తమ తమ జిల్లా కేంద్రాలకు వెళ్లి.. మెమోరాండం ఇవ్వాలని వినేష్ ఫోగట్ విజ్ఞప్తి చేశారు. మే 16న సత్యాగ్రహం చేయాలని కోరారు.
భారత రెజ్లింగ్ సమాఖ్యను.. ఒలింపిక్ సంఘం రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామని రెజ్లర్ బజరంగ్ పునియా వ్యాఖ్యానించారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో.. ఢిల్లీ పోలీసులు గురువారం బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేశారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఢిల్లీ పోలీసులు గత నెలలో రెండు కేసులు నమోదు చేశారు.
భారత రెజ్లింగ్ సమాఖ్యను.. ఒలింపిక్ సంఘం రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామని రెజ్లర్ బజరంగ్ పునియా వ్యాఖ్యానించారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో.. ఢిల్లీ పోలీసులు గురువారం బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేశారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఢిల్లీ పోలీసులు గత నెలలో రెండు కేసులు నమోదు చేశారు.