యాప్నగరం

రేపు ప్రమాణస్వీకారానికి అనుమతికోరిన యడ్డీ!

కర్ణాటక బీజేపీ శాసనసభాపక్ష నేతగా బీఎస్ యడ్యూరప్పను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఆయన్ని బీజేఎల్పీ నేతగా ఎన్నుకుంటూ తీర్మానం చేశారు.

Samayam Telugu 16 May 2018, 11:47 am
కర్ణాటక బీజేపీ శాసనసభాపక్ష నేతగా బీఎస్ యడ్యూరప్పను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఆయన్ని బీజేఎల్పీ నేతగా ఎన్నుకుంటూ తీర్మానం చేశారు. బీజేఎల్పీ నేతగా ఎన్నికైన అనంతరం యడ్యూరప్ప, ఆ పార్టీ సీనియర్ నేతలు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ వాజూభాయ్ వాలను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ గవర్నర్‌కు ఓ లేఖ సమర్పించారు. అలాగే సీఎంగా గురువారం ప్రమాణ స్వీకారానికి అనుమతించాలని యడ్యూరప్ప విఙ్ఞ‌ప్తి చేశారు. యడ్యూరప్ప వెంట కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేవకర్, జేపీ నడ్డా, సదానంద గౌడ తదితరులు ఉన్నారు. తమకు అవసరమైన మెజార్టీ సాధిస్తామని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. లింగాయత్ వర్గం ఎమ్మెల్యేలతో యడ్డీ మంతనాలు సాగించినట్టు ప్రచారం సాగుతోంది.
Samayam Telugu బీఎస్ యడ్యూరప్ప


దీంతో కర్ణాటక రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. మంగళవారం వెల్లడైన ఫలితాల్లో 104 స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా సాధారణ మెజార్టీకి అవసరమైన సంఖ్యా బలాన్ని మాత్రం సాధించలేకపోయింది. దీంతో 78 సీట్ల సాధించిన కాంగ్రెస్ పార్టీ, 38 స్థానాలు గెలుపొందిన జేడీఎస్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకవపోవడంతో గవర్నర్ నిర్ణయం కీలకంగా మారింది. ఆయన తీసుకునే నిర్ణయంపైనే కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. తామే కొత్త ప్రభుత్వాన్ని రేపు ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.