యాప్నగరం

టీడీపీపై మండిపడ్డ యడ్యూరప్ప..!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య కొత్త గొడవ రేగింది

Samayam Telugu 10 Apr 2018, 12:25 pm
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య కొత్త గొడవ రేగింది. కర్ణాటక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీలో లేదు.. అయినప్పటీ ఈ రెండు పార్టీలకూ కన్నడనాట రచ్చ రాజుకోవడం గమనార్హం. ఏపీకి భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసిందని అంటూ, అందుకు ప్రతిగా కర్ణాటకలోని తెలుగు వారు బీజేపీకి ఓటు వేయొద్దంటూ తెలుగుదేశం నేతలు పిలుపునిస్తున్నారు. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తాజాగా కర్ణాటకలో పర్యటిస్తూ ఈ వ్యాఖ్య చేశారు.
Samayam Telugu bsy


కర్ణాటకలో తెలుగు మాట్లాడే ప్రజలు పెద్ద ఎత్తున ఉంటారు. రాయలసీమ ప్రాంతంతో సరిహద్దును పంచుకునే కర్ణాటకలోని జిల్లాల్లో తెలుగే ప్రధాన భాష. కర్ణాటక రాజధాని బెంగళూరులో కూడా తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున ఉన్నారు. అక్కడే సెటిలైపోయి, ఆస్తులను, ఓటు హక్కును కూడా తీసుకున్న ప్రజలు తెలుగు ప్రాంతాలతో సంబంధబాంధవ్యాలను కొనసాగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అలాంటి తెలుగు వాళ్లు అంతా బీజేపీకి సహకరించవద్దు అని, కర్ణాటకలో బీజేపీని ఓడించాలని తెలుగుదేశం నేతలు అంటున్నారు.

ఏపీ టీడీపీ నేతలు ఇలా మాట్లాడుతుండటం పట్ల కర్ణాటక బీజేపీ నేత, ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేఈ కృష్ణమూర్తిని ఉద్దేశించి విమర్శలు చేశారు యడ్యూర్ప. ‘ఎవరతడు? కర్ణాటకలోని తెలుగు ప్రజలకు పిలుపునివ్వడానికి అతడెవరు? ఇక్కడి తెలుగు ప్రజల బాగోగులను చూసుకోవడంలో భారతీయ జనతా పార్టీ ముందుంది. ఇక్కడి ప్రజలు తెలుగుదేశం నేతలను మాటలను పట్టించుకోరు..’ అని అన్నారాయన.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.