యాప్నగరం

గోవా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన మరో ఎమ్మెల్యే

గోవాలో కాంగ్రెస్ పార్టీకి మరో ఝలక్. నిన్న విశ్వజిత్ రానే అనే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం మరవకముందే..

TNN 17 Mar 2017, 2:46 pm
గోవాలో కాంగ్రెస్ పార్టీకి మరో ఝలక్. నిన్న విశ్వజిత్ రానే అనే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం మరవకముందే.. మరో ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. తాజాగా ఎస్ రోడ్రిగ్స్ అనే ఎమ్మెల్యే గోవా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేయడానికి ప్రధాన కారణమేంటని ప్రశ్నించినప్పుడు.. అతడు ‘రాహుల్ గాంధీని నాయకుడిగా నేను అంగీకరించడం లేదు’ అంటూ వ్యాఖ్యానించారు. గోవా ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెందిన కాంగ్రెస్ పార్టీపై ఆయన విమర్శలు చేశారు. ‘ఈ వైఫల్యానికి రాహుల్ గాంధీ బాధ్యత వహించనప్పుడు.. దిగ్విజయ్ సింగ్ అయినా బాధ్యత వహించాలి’ అని ఆయన పేర్కొన్నారు.
Samayam Telugu yet another congress mla from goa quits says cant accept rahul gandhi as my leader
గోవా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన మరో ఎమ్మెల్యే


గోవాలో కాంగ్రెస్ ఓటమికి దిగ్విజయ్‌దే బాధ్యత అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మనోహర్ పారికర్ కూడా వ్యాఖ్యానించడం గమనార్హం. బలపరీక్షకు ముందు గోవా వచ్చిన దిగ్విజయ్.. అందుకోసం పనిచేయడానికి బదులు, గోవాలో ఎంజాయ్ చేశారంటూ పారికర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

నిన్న ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన కొన్ని గంటల్లోనే రాజీనామా చేసిన విశ్వజిత్ రానే కూడా కాంగ్రెస్ అధిష్టానంపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ‘నాకు ఈ పార్టీ(కాంగ్రెస్)లో కొనసాగడానికి ఇక ఎంతమాత్రం ఇష్టం లేదు. ఈ తిరుగుబాటు నాతోనే ఆగదు. నేను మళ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నా’ అని ఆయన నిన్న (మార్చి 16) పేర్కొన్నారు. బల పరీక్షలో పారికర్‌కు వ్యతిరేకంగా ఓటేయాలంటూ కాంగ్రెస్ అధిష్ఠానం జారీ చేసిన విప్‌పై సంతకం చేసినప్పటికీ.. ఆయన నిన్న అసెంబ్లీకి గైర్హాజరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.