యాప్నగరం

యూపీ సీఎం.. మరో సంచలన నిర్ణయం!

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో... ముజఫర్‌ నగర్, షమ్లి జిల్లాల్లో మత ఘర్షణలకు సంబంధించి కేసులను ఎత్తివేయాలని నిర్ణయించారు.

TNN 22 Mar 2018, 8:17 pm
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో... ముజఫర్‌ నగర్, షమ్లి జిల్లాల్లో మత ఘర్షణలకు సంబంధించి కేసులను ఎత్తివేయాలని నిర్ణయించారు. ఈ మత ఘర్షణలకు సంబంధించి మొత్తం 131 కేసులు నమోదయ్యాయి. ఇందులో 13 హత్య కేసులు, 11 హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి. ఈ కేసుల్లో... ఏడేళ్ల వరకు శిక్ష పడగల తీవ్రనేరాలతో పాటు... 16 మందిపై సెక్షన్ 153ఏ, సెక్షన్ 295ఏ వంటి అభియోగాలు కూడా ఉన్నాయి.
Samayam Telugu Yogi


2013 సెప్టెంబర్‌లో ముజఫర్‌నగర్, షమ్లిలో చెలరేగిన మత ఘర్షణల కారణంగా దాదాపు 62 మందికి పైగా చనిపోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో అప్పటి సమాజ్‌ వాదీ ప్రభుత్వం దాదాపు 1455 మందిపై కేసులు పెట్టింది. ముజఫర్‌ నగర్, షమ్లి పోలీస్ స్టేషన్లలో మొత్తం 503 కేసులు నమోదయ్యాయి.

కాగా ఈ రెండు ప్రాంతాల ఖాప్ నాయకులు, బీజేపీ ఎంపీ సంజయ్ బాల్యన్, పార్టీ ఎమ్మెల్యే ఉమేష్ మాలిక్ తదితరులు సీఎం యోగిని గత నెల 5న యోగిని కలుసుకున్నారు. మొత్తం 179 కేసుల జాబితాను ఆయనకు అందజేశారు. ప్రభుత్వం ఉపసంహరించాలనుకుంటున్న కేసుల్లో వీటిలోనుంచే 131 కేసులు ఉండటం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.