యాప్నగరం

'వందే మాతరం' వివాదంపై సీఎం సీరియస్!

ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి మళ్లీ కోపమొచ్చింది. వందేమాతరం గేయం ఆలపించడంలో మీకొచ్చిన...

TNN 9 Apr 2017, 10:17 am
ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి మళ్లీ కోపమొచ్చింది. వందేమాతరం గేయం ఆలపించడంలో మీకొచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదని కొంతమంది ప్రతిపక్ష నేతలపై యోగి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. మన దేశ జాతీయ గేయాన్ని ఆలపించడానికి కొంతమంది ప్రతిపక్ష నేతలు అభ్యంతరం చెప్పడం అనేది తీవ్ర ఆందోళన రేకెత్తించే అంశం అని ఆవేదన వ్యక్తంచేశారు సీఎం యోగి ఆదిత్యనాథ్. 'గవర్నర్స్ గైడ్: రోల్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ది గవర్నర్ అండర్ ది కాన్సిట్యూషన్ ఆఫ్ ఇండియా' అనే పుస్తకావిష్కరణలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ న్యాయ సలహాదారు ఎస్ఎస్ ఉపాధ్యాయ్ రచించిన ఈ పుస్తకావిష్కరణ సభలో ఆ రాష్ట్ర గవర్నర్ కూడా పాల్గొన్నారు. యూపీ రాజ్‌భవన్‌లో శనివారం ఈ కార్యక్రమం జరిగింది.
Samayam Telugu yogi adityanath lashed out at the controversy over vande mataram
'వందే మాతరం' వివాదంపై సీఎం సీరియస్!


మీరట్ మునిసిపల్ కార్పొరేషన్ హాలులో ఇటీవల జరిగిన ఓ సమావేశంలో జాతీయ గేయం వందే మాతరం ఆలపించడాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది కార్పొరేటర్లు నిరసన తెలిపారు. దీంతో ఈ వివాదం తెరపైకొచ్చింది. ఈ వివాదంపై మాట్లాడుతూ.. ఇటీవల అలహాబాద్ హై కోర్టు 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోడీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కెహర్‌తోపాటు తాను పాల్గొన్న సందర్భాన్ని యోగి గుర్తుచేసుకున్నారు. ఈ ఉత్సవాల్లో వందేమాతర గేయాన్ని ఆలపించడాన్ని సైతం రాష్ట్రంలో కొంతమంది తప్పుపడుతున్నారని, దీనిని అనవసరంగా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు సీఎం యోగి ఆదిత్యా నాథ్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.