యాప్నగరం

సీఎం అయ్యానని తాగి తూలొద్దు: యోగి ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కనున్న యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టకముందే తన మార్కు చూపించారు.

TNN 19 Mar 2017, 11:22 am
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కనున్న యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టకముందే తన మార్కు చూపించారు. రాష్ట్రంలో తన పరిపాలన ఎలా ఉండబోతోందో సూచనప్రాయంగా తెలియజేశారు. నేను సీఎంని అయినంత మాత్రాన సంబరాల పేరుతో సామాన్య ప్రజలకి ఇబ్బంది కలిగొంచద్దని, తాగి తందనాలు ఆడొద్దని తన పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ మేరకు శనివారం రాత్రి రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశం కూడా నిర్వహించారు.
Samayam Telugu yogi adityanaths first order no ruckus in name of revelry
సీఎం అయ్యానని తాగి తూలొద్దు: యోగి ఆదిత్యనాథ్


లక్నోలోని వీవీఐపీ గెస్ట్‌హౌస్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాహుల్ భట్నాగర్, హోం శాఖ కార్యదర్శి దేవాశిష్ పాండా, డీజీపీ జావేద్ అహ్మద్‌తో యోగి ఆదిత్యనాథ్ సమావేశమయ్యారు. రోడ్లపై ఎలాంటి సంబరాలను అనుమతించవద్దని వారికి సూచించారు. లా అండ్ ఆర్డర్‌ను ఇబ్బంది పెట్టే అత్యుత్సాహ పార్టీ వర్కర్లపై ఓ కన్నేసి ఉంచాలని పోలీసు బాస్‌ను ఆదేశించారు. వీరి సంబరాల కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్య ప్రజలు ఇబ్బంది పడటానికి వీల్లేదని స్పష్టం చేశారు.

అలాగే ఆయన ప్రమాణస్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కనీసం ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూసుకోవాలని అధికారులను ఆదిత్యనాథ్ ఆదేశించారు. కాగా, ఈరోజు మధ్యాహ్నం 2.15 గంటలకు ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేస్తారు. అలాగే కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.