యాప్నగరం

గర్భిణీలు.. అది చెప్పండి.. రూ.లక్ష గెలవండి

గర్భిణీలకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. లింగ నిర్ధారణను అరికట్టేందుకు యోగి ఆదిత్యనాథ్

Samayam Telugu 24 Jun 2017, 11:38 am
గర్భిణీలకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. లింగ నిర్ధారణను అరికట్టేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్ భాగంగా ‘డెకాయ్’ (మిషన్) పథకాన్ని జులై 1 నుంచి అమలు చేయనుంది. ఆసుపత్రులు, పరీక్షా కేంద్రాల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు గర్భిణీలు తమ దృష్టికి తీసుకొస్తే రూ.లక్ష బహుమతిగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి వివరాలు అందించే వారికీ మరో రూ.లక్ష వరకు నజరానా ఇవ్వనున్నట్లు ప్రకటింది. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని పట్టిస్తే గర్భిణి వెంట వచ్చే కుటుంబ సభ్యులకూ రూ.40వేలు బహుమతిగా ఇస్తారు. డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో జరిగే అక్రమ దందాలు వెలుగులోకి తెచ్చే వారెవరైనా రూ.60వేలు బహుమతిగా పొందేలా ప్రభుత్వం ఈ నూతన పథకాన్ని ప్రారంభించనుంది.
Samayam Telugu yogi offers pregnant women rs 1 lakh prize for exposing prenatal sex test centres
గర్భిణీలు.. అది చెప్పండి.. రూ.లక్ష గెలవండి


లింగనిష్పత్తిలో బాలికల జనాభా దారుణంగా పడిపోతుండటంతో యోగి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం వెయ్యి మంది బాలురకు 902 మంది బాలికలున్నారు. 2001లో ఈ నిష్పత్తి 1000:916గా ఉంది. దీంతో బాలికల సంఖ్య తగ్గుతోందని, ఈ పరిస్థితులు లింగనిర్ధాణ జరిగాక.. పుట్టబోయేది ఆడబిడ్డ అని తెలిస్తే పురిట్లోనే చంపేస్తున్నారని, లేదా గర్భవిచ్ఛిత్తికి ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వం గుర్తించి..వాటిని అరికట్టడానికి కఠిన చర్యలు ప్రారంభించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.