యాప్నగరం

హిందూ ఉగ్రవాదం ఉంది: కమల్ హాసన్

త్వరలో రాజకీయ రంగ ప్రవేశం అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ బీజేపీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

TNN 2 Nov 2017, 1:34 pm
త్వరలో రాజకీయ రంగ ప్రవేశం అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ బీజేపీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోతోందని అన్నారు. దేశంలో హిందూ టెర్రర్ లేదని ఎవరూ చెప్పలేరని కుండ బద్దలుకొట్టారు. హిందూ ఉగ్రవాదం ఉందన్న విషయాన్ని అతివాదులు అంగీకరించి తీరాల్సిందేనని పేర్కొన్నారు. ‘ఆనంద వికటన్’ అనే తమిళ మ్యాగజైన్‌కు ప్రతి వారం రాసే కాలమ్‌లో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu you cant say there is no hindu terror kamal haasan
హిందూ ఉగ్రవాదం ఉంది: కమల్ హాసన్


‘గతంలో హిందూ అతివాదులు తమ వాదనలు మాత్రమే వినిపించేవారు. కానీ ఇప్పుడు వారు హింసకు తెగబడుతున్నారు’ అని కమల్ ఘాటుగానే రాశారు. ‘సత్యమేవ జయతే’ అనే నినాదంపై ప్రజలకు నమ్మకం పోతోందని కమల్ తన కాలమ్‌లో పేర్కొన్నారు. ‘ఒకప్పుడు సత్యం ఒంటరిగా విజయం సాధించేది. కానీ ఇప్పుడు శక్తి ఒక్కటే గెలుస్తోంది. ఇది ప్రజల్ని అమానుషంగా తయారుచేస్తోంది’ అని మండిపడ్డారు. కాషాయి దళంలోకి ఉగ్రవాదం వచ్చి చేరిందని, దీన్ని వాళ్లు అంగీకరించాల్సిందే అని కమల్ తన వ్యాసంలో రాశారు.

ఇదే వ్యాసంలో మతపరమైన అల్లర్ల గురించి కూడా కమల్ ప్రస్తావించారు. హిందుత్వ శక్తులను అణచివేసి, మతపరమైన అల్లర్లకు అడ్డుకట్టవేయడంతో కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కమల్ కొనియాడారు. ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వంతో పోలిస్తే కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయన్నారు. తమిళ సంస్కృతిని, ఉనికిని లేకుండా చేయాలని చూస్తున్న హిందుత్వ శక్తులపై మీ అభిప్రాయం ఏంటని కేరళ సీఎం పినరయి విజయన్ అడిగిన ప్రశ్నకు కమల్ ఈ విధంగా కాలమ్ ద్వారా స్పందించారు. కాగా, నవంబర్ 7న తన పుట్టిన రోజు సందర్భంగా ఓ కీలక ప్రకటన చేయబోతున్నట్లు కమల్ హాసన్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.