యాప్నగరం

డిజిటల్ పేమెంట్లపై ఫిర్యాదుల కోసం హెల్ప్‌లైన్

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తరవాత డిజిటల్ పేమెంట్లపై అత్యధికంగా దృష్టి సారించింది.

TNN 28 Dec 2016, 7:12 pm
కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తరవాత డిజిటల్ పేమెంట్లపై అత్యధికంగా దృష్టి సారించింది. ఈ మేరకు దేశంలో డిజిటల్ పేమెంట్లను పెంచడానికి, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ప్రజల్లో మాత్రం డిజిటల్ పేమెంట్స్‌పై చాలా అపోహలు, అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి వాటిని నివృతి చేసుకోవడానికి, డిజిటల్ పేమెంట్లపై ఫిర్యాదులను స్వీకరించడానికి దేశ వ్యాప్తంగా ఒక హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది.
Samayam Telugu you may soon dial this number for all your queries on digital payments
డిజిటల్ పేమెంట్లపై ఫిర్యాదుల కోసం హెల్ప్‌లైన్


ఈ మేరకు నాస్కామ్, టెలీకాం ఆపరేటర్లు, నీతి ఆయోగ్ సంయుక్తంగా 14444 హెల్ప్‌లైన్ నంబర్‌ను తీసుకొస్తున్నాయి. ఈ టోల్‌ఫ్రీ నంబర్‌కి ఫోన్‌చేసి ప్రజలు డిజిటల్ పేమెంట్లపై తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. డిజిటల్ పేమెంట్స్‌పై నియమించిన ముఖ్యమంత్రుల కమిటీ నాలుగో సమావేశం బుధవారం ఢిల్లీలో జరిగింది. సమావేశం అనంతరం మాట్లాడిన కమిటీ కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. దేశ వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలను పెంచడానికి ఒక మిలియన్ పీఏఎస్ యంత్రాలు (స్వైపింగ్ మెషీన్లు) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

నాస్కామ్, టెలీకాం కంపెనీలతో కలసి ఒక హెల్ప్‌లైన్‌ను తీసుకొస్తున్నట్లు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా వెల్లడించారు. డిజిటల్ పేమెంట్లకు సంబంధించిన అన్ని ఫిర్యాదులు ఈ హెల్ప్‌లైన్ ద్వారా స్వీకరిస్తామని చెప్పారు. త్వరలోనే ఈ హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.