యాప్నగరం

చేతనైతే వర్షాలు ఆపండి చూస్తా: శివసేన అధినేత!

రెండు రోజులు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ముంబై మహానగరం చిగురుటాకులా వణిపోయింది. దీనిపై ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.

TNN 31 Aug 2017, 10:44 am
రెండు రోజులు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ముంబై మహానగరం చిగురుటాకులా వణిపోయింది. కుండపోత వర్షాలకు దేశ ఆర్థిక రాజధానిలో ప్రజా జీవనం అతలాకుతలమై, రైళ్లు, విమానాలు, రవాణా వ్యవస్థ ఎక్కడిక్కడే స్థంభించిపోయాయి. వర్షాలపై మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రస్తుతం ముంబై కార్పొరేషన్‌‌లో అధికారంలో ఉన్న శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే మీడియాపై రుసరుసలాడారు., ఇంత భారీ వర్షాలకు కారణం నదులు, నాలాలా ఆక్రమణలేనని, వరదలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని మీడియా ప్రస్తావించడంతో థాక్రేకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చేతనైతే మీరు వర్షాలను ఆపండి, నేను చూస్తా నంటూ మీడియా ప్రతినిధులపై విరుచుకుపడ్డారు.
Samayam Telugu you stop rains shiv sena president uddhav thackerays retort to media
చేతనైతే వర్షాలు ఆపండి చూస్తా: శివసేన అధినేత!


"నేనేం చేయాలో మీరు చెప్పండి. వర్షాలను ఎలా ఆపాలో చెబితే చేస్తాను. గతంలో మేము ప్రజలకు మంచి చేశాం కాబట్టే మరోసారి అధికారంలోకి వచ్చామని థాక్రే వ్యాఖ్యానించారు. నాలాల్లో నీరు నిలవకుండా చూసేందుకు ఏటా కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని అన్నారు. మీడియా పట్ల దురుసుగా వ్యవహరించిన ఉద్ధవ్ థాక్రే వారికి క్షమాపణ చెప్పాలని బీజేపీ ముంబై నగర అధ్యక్షుడు ఆశిష్ షేల్కర్ డిమాండ్ చేశారు. 2005లో కురిసిన భారీ వర్షానికి ముంబయి నగరం అతలాకుతలమైంది. అ వర్షాలకు 500 మంది ప్రాణాలు కోల్పోగా, రూ.17 వేల కోట్ల నష్టం వాటిల్లింది. మళ్లీ అంతటిస్థాయిలో భారీ వర్షాలు కురవడం ఇదే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.