వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కానీ కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఢిల్లీకి పారిపోయి అక్కడే పెళ్లి చేసుకుని అక్కడే కాపురం పెట్టారు. ఏడాది తర్వాత గ్రామానికి తిరిగి వచ్చిన ఆ జంటకు పెద్దలు ఊహించని షాక్ ఇచ్చారు. కులాంతర వివాహం చేసుకున్నారనే కారణంతో వారికి రూ.2.5 లక్షల జరిమానా విధించారు. జరిమానా చెల్లించిన తర్వాతే ఊరిలో అడుగు పెట్టాలని ఆదేశించారు. దీంతో బాధిత జంట పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన బీహార్లోని పునియా ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. చంపానగర్కు చెందిన లడ్డూ సింగ్, సోనీ గతేడాది గ్రామం నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం ఢిల్లీలో కాపురం పెట్టారు. ఈ నేపథ్యంలోనే సోనీ గర్భం దాల్చింది. దీంతో కుటుంబసభ్యులను చూడాలన్ని ఉద్దేశంతోవారిద్దరూ గ్రామానికి తిరిగి వచ్చారు. అయితే కులాంతర వివాహం చేసుకున్నారనే కారణంతో గ్రామ పెద్దలు వారిని ఊళ్లోకి రానివ్వలేదు. రూ.2.5 లక్షలు పంచాయితీకి జరిమానాగా కడితేనే గ్రామంలోకి అనుమతిస్తామని తీర్పు చెప్పారు.
జరిమానా కట్టేలా లడ్డూ సింగ్ తండ్రి, సోనీ తండ్రి నుంచి బాండ్ కూడా రాయించుకున్నారు. దీంతో ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామ పెద్దలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.
జరిమానా కట్టేలా లడ్డూ సింగ్ తండ్రి, సోనీ తండ్రి నుంచి బాండ్ కూడా రాయించుకున్నారు. దీంతో ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామ పెద్దలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.