యాప్నగరం

హనీమూన్‌కు వెళ్లొచ్చి క్వారంటైన్‌ రూల్స్ బ్రేక్.. ఐఏఎస్ ఆఫీసర్‌పై కేసు నమోదు

విదేశాలకు వెళ్లొచ్చిన యువ ఐఏఎస్ ఆఫీసర్ హోం క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించారు. దీంతో ఆయనపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు.

Samayam Telugu 27 Mar 2020, 8:56 pm
ఆయనో యువ ఐఏఎస్ ఆఫీసర్. ఇటీవలే పెళ్లయ్యింది. భార్యతో కలిసి విదేశాలకు హనీమూన్ వెళ్లొచ్చాడు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు తెలపగా.. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. 14 రోజులు హోం క్వారంటైన్లో ఉండాలని, ఎవర్నీ కలవొద్దని ఆదేశించారు. కానీ ఆయన మాత్రం ఎవరికీ చెప్పా పెట్టకుండా బెంగళూరు వెళ్లిపోయాడు. దీంతో ఆ అధికారిపై కేసు నమోదైంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదే‌శ్‌కు చెందిన అనుపమ్ మిశ్రా కేరళలోని కొల్లాంలో సబ్‌కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఆయన మలేసియా, సింగపూర్ దేశాలకు వెళ్లి మార్చి 19న తిరిగొచ్చారు. కరోనా నేపథ్యంలో ఆయన్ను 14 రోజులపాటు హోం క్వారంటైన్లో ఉండాలని కలెక్టర్ అబ్దుల్ నసీర్ ఆదేశించారు.
Samayam Telugu quarantines


మిశ్రాకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. కోవిడ్ లక్షణాలేవీ కనిపించలేదు. హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించినప్పటికీ ఆయన పై అధికారులకు సమాచారం ఇవ్వకుండా కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులోని సోదరుడి దగ్గరకు వెళ్లాడు. కలెక్టర్ ఆయన్ను సంప్రదించగా.. తాను బెంగళూరులో ఉన్నానని అనుపమ్ బదులిచ్చాడు.

కొల్లాంలోని క్వార్టర్స్‌లో సబ్ కలెక్టర్ హోం క్వారంటైన్లో ఉండాల్సి ఉండగా.. ఆరోగ్య శాఖ అధికారులు తరచుగా అక్కడికి వెళ్లి ఆయన్ను పరిశీలిస్తున్నారు. కానీ అక్కడికి వెళ్లి చూడగా... సబ్ కలెక్టర్ కనిపించలేదు. కరోనా లక్షణాలు లేనప్పటికీ.. ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా సెలవు పెట్టకుండా ఆయన బెంగళూరు వెళ్లడాన్ని పై అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆయన ప్రస్తుత అడ్రెస్, ప్రయాణ వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ముందస్తుగా సమాచారం లేకుండా, అనుమతి పొందకుండా రాష్ట్రం దాటి ఎందుకు వెళ్లారో వివరణ ఇవ్వాలని సబ్ కలెక్టర్‌ను ప్రభుత్వం కోరింది.

Must Read: పోర్న్ సైట్లకు భారీగా పెరిగిన గిరాకీ.. అదును చూసి ఉచిత ఆఫర్లు

నిబంధనలను ఉల్లంఘించిన సదరు సబ్ కలెక్టర్‌పై ఐపీసీ 188, 269, 271 సెక్షనన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మరో విషయం ఏంటంటే పోలీసులు మిశ్రా మొబైల్ సిగ్నల్ ట్రేస్ చేయగా అది ఉత్తరప్రదేశ్‌లో ఉన్నట్లు చూపించింది. సబ్ కలెక్టర్ వ్యక్తిగత సిబ్బంది, గన్‌‌మెన్‌ను కూడా అబ్జర్వేషన్లో ఉంచారు.

కేరళలోని కొల్లాం జిల్లాలో మాత్రమే ఇప్పటి వరకూ కరోనా కేసులు నమోదు కాలేదు. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకూ 126 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.