యాప్నగరం

మళ్లీ జికా వణుకు.. 72కి చేరిన కేసులు

మళ్లీ వణకిస్తున్న జికా వైరస్.. రాజస్థాన్‌లో 72కు చేరిన బాధితుల సంఖ్య.. అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు..

Samayam Telugu 16 Oct 2018, 11:25 am
రాజస్థాన్‌లో జికా వైరస్ పంజా విసురుతోంది. రెండు రోజుల్లో మరో 21మందికి ఈ మహమ్మారి సోకడంతో.. బాధితుల సంఖ్య 71కి చేరింది. తాజాగా జైపూర్‌లోని సింధి క్యాంప్ ఏరియాలో 11 కేసులు.. నగరంలో మరో 12 కేసులు నమోదయ్యాయి. వీరికి డాక్టర్లు ప్రత్యేక వార్డులో చికిత్స అందజేస్తున్నారు. ఈ 72మందిలో 60మంది కోలుకుంటున్నారని వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ సెక్రటరీ వీనూ గుప్తా తెలిపారు.
Samayam Telugu Zika


జికా వైరస్ వ్యాపిస్తుండటంతో.. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జైపూర్‌లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. సర్వే చేయించారు. ఈ సర్వేలో భాగంగా దాదాపు 96వేల ఇళ్లకు వెళ్లారు. దోమలవ్యాప్తికి కారణమవుతున్న ఇళ్ల యజమానులకు వైద్యాధికారులు చలాన్ లు విధించారు. మరీ ముఖ్యంగా జికా వైరస్ కేసులు నమోదైన శాస్త్రి నగర్, విద్యానగర్, బెనాడ్, న్యూ సంగ్నేర్ రోడ్, సింధి క్యాంప్ ప్రాంతాలపై దృష్టిపెట్టారు అధికారులు.

సింధి క్యాంప్ ఏరియాలో ఉన్న రాజ్‌పుత్ హాస్టల్‌లోని ఏడుగురు విద్యార్థులకు జికా వైరస్ సోకడంతో.. విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలని సూచించిన అధికారులు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ సూచనలు చేస్తున్నారు. జ్వరం, చర్మంపై పొక్కులు, కండరాల నొప్పులుంటే డాక్టర్లను సంప్రదించాలంటున్నారు. అలాగే దోమల నివారణకు అధికారులు చర్యలు ప్రారంభించారు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.