యాప్నగరం

గాల్లో 15 నిమిషాలు.. వణికించిన ఇండిగో!

తిరుపతి - హైదరాబాద్ విమాన ఘటన మరవక ముందే.. వణికించిన మరో ఇండిగో విమానం.

Samayam Telugu 30 Mar 2018, 11:45 pm
శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం టైరు పేలిన ఘటన ఇంకా మరవక ముందే ఆందోళన కలిగించే మరో ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. శంషాబాద్ నుంచి టేకాఫ్ తీసుకున్న ఇండిగో 6E 845 విమానం 15 నిమిషాలు పాటు గాల్లో చక్కర్లు కొట్టి అత్యవసరంగా ల్యాండయ్యింది. ఆ సమయంలో 165 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు.
Samayam Telugu indi


సరిగ్గా రెండు రోజల క్రితమే శంషాబాద్‌ విమానాశ్రయరంలో 177 మంది ప్రయాణికులతో వెళ్తున్న తిరుపతి-హైదరాబాద్ విమానం త్రుటిలో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ విమానంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా ఉన్నారు. ఈ ఘటనలో విమానం నాలుగు టైర్లు పేలిపోయినట్లు తెలిసింది. వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు విమానం ఎక్కాలంటేనే భయపడుతున్నారు.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.