యాప్నగరం

Four Day Working Week ఫుల్ శాలరీ.. వారంలో 4 రోజులే పని.. సంతకాలు చేసిన 100 కంపెనీలు

Four Day Working Week కరోన మహమ్మారి వ్యాప్తి తర్వాత ప్రజల ఆలోచన విధానంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు తమ పని విధానంలో మార్పులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వారంలో నాలుగు రోజుల పని దినాల గురించి చర్చ జరుగుతోంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే ఈ పని విధానం అమల్లోకి వచ్చింది. మరికొన్ని దేశాల్లోని సంస్థలు దీనిని అమలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. తాజాగా, బ్రిటన్‌లోని సంస్థలు దీనిపై సంతకం చేశారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 29 Nov 2022, 11:32 am

ప్రధానాంశాలు:

  • నాలుగు రోజుల పని విధానం తీవ్రంగా చర్చ
  • క్రమంలో మార్పులు చేపడుతున్న సంస్థలు
  • ఉద్యోగులకు శుభవార్త చెప్పిన బ్రిటన్ సంస్థలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Working
Four Day Working Week వేతనాల్లో ఎటువంటి కోతలు విధించకుండా ఉద్యోగులందరికీ శాశ్వతంగా వారానికి నాలుగు రోజుల పని విధానానికి ఆమోదం తెలుపుతూ బ్రిటన్‌లో వంద కంపెనీలు సంతకం చేశాయి. మొత్తం 2,600 మంది సిబ్బందిని నియమించుకున్న ఈ 100 కంపెనీలు.. నాలుగు రోజుల పని విధానం అమలు నిర్ణయం దేశంలో మార్పును తీసుకురాగలదని ఆశిస్తున్నాయి. మునపటి ఆర్థిక యుగంలోని ఐదు రోజుల పని విధానానికి కాలం చెల్లిందని ఆ సంస్థలు పేర్కొన్నాయి. ది గార్డియన్ ప్రకారం.. వారంలో నాలుగు రోజుల పని విధానం తమ ఉత్పాదకతను మెరుగుపరచడానికి, అదే పనిని ఉద్యోగులు తక్కువ గంటల్లో పూర్తి చేయడానికి సహకరిస్తుందని పేర్కొన్నారు.
ఈ విధానాన్ని ముందుగా అమల్లోకి తీసుకొచ్చి ఉద్యోగులను ఆకర్షించడానికి, నిలుపుకోవడానికి ఒక గొప్ప మార్గాన్ని కూడా వీరు కనుగొన్నారు. నాలుగు రోజుల పని విధానంపై సంతకం చేసిన 100 కంపెనీలలో యూకేలోని రెండు అతిపెద్ద సంస్థలైన ఆటమ్ బ్యాంక్, గ్లోబల్ మార్కెటింగ్ కంపెనీ అవిన్ ఉండటం గమనార్హం. ఈ రెండు సంస్థల్లో ఒక్కోదానిలో 450 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు 4 రోజుల పని విధానంతో సిబ్బందికి పని గంటలను తగ్గించవచ్చని నిరూపించారు.

అవిన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆడమ్ రాస్ ది గార్డియన్‌తో మాట్లాడుతూ.. కొత్త వర్కింగ్ విధానానికి మారడం చరిత్రలో మనం చూసిన అత్యంత పరివర్తనాత్మక కార్యక్రమాలలో ఒకటి అని వ్యాఖ్యానించారు. ‘గత ఏడాదిన్నర కాలంలో మేము ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సులో విపరీతమైన పెరుగుదలను చూడటమే కాకుండా మా కస్టమర్ సేవలు, సంబంధాలు, అలాగే ప్రతిభ సంబంధాలు, నిలుపుదలలోనూ ప్రయోజనం కలిగింది’’ రాస్ వ్యాఖ్యానించారు.

ఇక, 3,300 మంది ఉద్యోగులను కలిగి ఉన్న దాదాపు 70 కంపెనీల్లో నాలుగు రోజుల పని విధానంపై కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్, బోస్టన్ విశ్వవిద్యాలయంతో పాటు స్వయంప్రతిపత్తి కలిగిన ఓ థింక్‌ట్యాంక్ పరిశోధకులు ప్రపంచంలోనే అతిపెద్ద పైలట్‌ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. ఈ విధానం గురించి సెప్టెంబరులో నిర్వహించిన అధ్యయనంలో 88 శాతం మంది చాలా బాగా ఉందని, దాదాపు 95 శాతం మంది ఉత్పాదకత అలాగే ఉందని లేదా మెరుగుపడిందని చెప్పారు.

బ్రిటన్‌లోని టెక్నాలజీ, ఈవెంట్‌ లేదా మార్కెటింగ్ వంటి సేవా రంగంలోని చాలా సంస్థలు కొత్త పని విధానం అధికారికంగా స్వీకరించిన వాటిలో ఉన్నాయి. తయారీ, నిర్మాణ రంగానికి చెందిన కొన్ని సంస్థలు కూడా నాలుగు రోజుల పని విధానంపై సంతకాలు చేసినట్టు పేర్కొంది.

Read Latest International News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.