యాప్నగరం

కరోనాతో బెంబేలెత్తుతున్న ప్రజలు.. స్వీయ నిర్బంధంలో 100 కోట్ల మంది

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. శనివారం సుమారు 100 కోట్ల మంది ఇళ్లల్లోనే స్వీయ నిర్బంధంలోనే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

Samayam Telugu 22 Mar 2020, 10:16 am
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా 3లక్షల మందికి పైగా సోకింది. ఇప్పటికే 13వేల మందికి పైగా ప్రజలు దీని బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో ప్రస్తుతం రెండో దశలో ఉన్న ఈ వైరస్ మరింతగా వ్యాపిస్తోంది. దీన్ని నివారించే చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు ఆదివారం దేశమంగా జనతా కర్ఫ్యూ పాటిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ వల్ల సుమారు 100 కోట్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితమైనట్లు తెలుస్తోంది.
Samayam Telugu ffffff


Also Read: కరోనా వైరస్: ఏమరపాటుగా ఉంటే లక్షలాది మంది చనిపోతారు.. ఐరాస హెచ్చరిక

35 దేశాల్లో సుమారు 100 కోట్ల మంది శనివారం తమ ఇళ్లకే పరిమితమయ్యారని నిపుణులు అంచనా వేస్తున్నారు. మృతుల సంఖ్య 13 వేలు దాటిపోవడంతో ఒక్కటొక్కటిగా దేశాలు తమ ప్రజల కదలికలపై ఆంక్షలు విధిస్తుండటమే దీనికి కారణం. ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ 4 కోట్ల మంది ప్రజల్ని అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం నిర్బంధించింది. ఇప్పుడు దాని బాటలోనే న్యూయార్క్‌, ఇల్లినాయిస్‌ రాష్ట్రాలు సైతం ప్రజలను కఠిన ఆంక్షలు విధించే ఆలోచనలో ఉన్నాయి. కరోనా వైరస్ పెద్ద వయస్కులకు మాత్రమే సోకుతుందని, తమకు ఇబ్బందేమీ ఉండదని యువత నిర్లక్ష్యం చేయవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అనవసరంగా చిక్కుల్లో పడొచ్చని చెబుతోంది.

Also Read: పాక్‌లో కరోనా విజృంభణ.. టెంట్లలో క్వారంటైన్.. రోడ్ల మీద తిరుగుతున్న కోవిడ్ బాధితులు!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.