Tika Dutta Pokharel: నేపాల్ దేశంలో పార్లమెంటు ఎన్నికల వేడి మొదలైంది. ఈ ఎన్నికల్లో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో వందేళ్ల వృద్ధుడు పోటీ చేస్తున్నారు. టికా దత్తా పోఖారెల్ అనే వందేళ్ల వృద్ధుడు నేపాల్ మాజీ ప్రధానిపై పోటీకి సై అంటున్నారు. మొన్న సోమవారమే 99 ఏళ్లు పూర్తి చేసుకొని వందో ఏట అడుగు పెట్టారు పోఖారెల్. నేపాలీ కాంగ్రెస్ నుంచి విడిపోయిన నేపాలీ కాంగ్రెస్ (Nepali Congress) (బీపీ) తరఫున గోర్ఖా-2 నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. గోర్ఖా-2 నియోజకవర్గం నుంచే నేపాల్ మాజీ ప్రధాని, మావోయిస్టు పార్టీ నేత పుష్పకమల్ దహల్ (ప్రచండ) కూడా పోటీ చేస్తున్నారు. అక్కడ నవంబరు 20న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. అయితే.. పోఖారెల్ (Tika Datta Pokharel) పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని.. బాగా నడవగలరు.. మాట్లాడగలరని నేపాలీ కాంగ్రెస్ (బీపీ) అధ్యక్షుడు సుశీల్ మాన్ సెర్చన్ వివరించారు. తాను పోటీ చేసే విషయంపై పోఖారెల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
"దేశంలో నిజమైన నాయకుడు లేడు. తమను తాము నాయకులుగా చెప్పుకునే వారు కేవలం డబ్బు సంపాదించడానికే వచ్చారు" అని పోఖారెల్ వ్యాఖ్యానించారు. "ప్రజలకు హక్కులు కల్పించడానికి, మన దేశాన్ని మళ్లీ హిందూ దేశంగా మార్చడానికి నేను నా అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశాను" అని మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న పోఖారెల్ (Tika Datta Pokharel) స్పష్టం చేశారు.
"దేశంలో నిజమైన నాయకుడు లేడు. తమను తాము నాయకులుగా చెప్పుకునే వారు కేవలం డబ్బు సంపాదించడానికే వచ్చారు" అని పోఖారెల్ వ్యాఖ్యానించారు. "ప్రజలకు హక్కులు కల్పించడానికి, మన దేశాన్ని మళ్లీ హిందూ దేశంగా మార్చడానికి నేను నా అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశాను" అని మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న పోఖారెల్ (Tika Datta Pokharel) స్పష్టం చేశారు.