పెరు రాజధాని లిమాలో కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించి నైట్ క్లబ్లో పార్టీ చేసుకుంటుండగా.. పోలీసులు రాకను గమనించి పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో తొక్కిసలాట చోటుచేసుకుని 13 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. స్థానిక థామస్ రెస్టోబార్ క్లబ్లో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ నిబంధనలు కొనసాగుతుండగా.. దాదాపు 120 మంది నైట్ క్లబ్లో జరిగిన పార్టీకి హాజరయ్యారు.
దీని గురించి పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు చేరుకున్నారు. దీంతో అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తోపులాట చోటుచేసుకుంది. ఒకరినొకరు నెట్టుకుంటూ బయటకు రావడానికి ప్రయత్నించారని స్థానిక పోలీస్ అధికారి ఒకరు వివరించారు. ఈ ఘటనలో మొత్తం 20 మంది గాయపడినట్టు మీడియా తెలిపింది.
రెండో అంతస్తులో ఉండటం వల్ల అందరూ ప్రవేశ ద్వారం నుంచి మెట్ల మీదుగా కిందకు రావడానికి ప్రయత్నించారు.. ఈ సందర్భంలో ద్వారం వద్దకు ఒక్కసారిగా ఒకరినొకరు నెట్టుకుంటూ రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని పెరూ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. అంతేకాదు, వారిని చెదరగొట్టడానికి పోలీసులు ఎటువంటి ఆయుధాలు, టియర్ గ్యాస్ ఉపయోగించలేదన్నారు. ఒకరినొకరు తోసుకోవడం వల్ల ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఇప్పటి వరకు పోలీసులు 23 మందిని అదుపులోకి తీసుకున్నారని అధికారులు తెలిపారు. అయితే, పోలీసులు టియర్ గ్యాస్ క్యాన్లతోనే లోపలికి ప్రవేశించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నైట్ క్లబ్ యజమానిపై మహిళా మంత్రి రొసారియో ససియోటా మండిపడ్డారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన ఈ చర్యలకు పాల్పడినట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కారణంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితి కొనసాగుతుంటే ఇటువంటి చర్యలకు పాల్పడటం క్షమించరాని నేరమని అన్నారు. క్లబ్ యజమానిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
దీని గురించి పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు చేరుకున్నారు. దీంతో అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తోపులాట చోటుచేసుకుంది. ఒకరినొకరు నెట్టుకుంటూ బయటకు రావడానికి ప్రయత్నించారని స్థానిక పోలీస్ అధికారి ఒకరు వివరించారు. ఈ ఘటనలో మొత్తం 20 మంది గాయపడినట్టు మీడియా తెలిపింది.
రెండో అంతస్తులో ఉండటం వల్ల అందరూ ప్రవేశ ద్వారం నుంచి మెట్ల మీదుగా కిందకు రావడానికి ప్రయత్నించారు.. ఈ సందర్భంలో ద్వారం వద్దకు ఒక్కసారిగా ఒకరినొకరు నెట్టుకుంటూ రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని పెరూ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. అంతేకాదు, వారిని చెదరగొట్టడానికి పోలీసులు ఎటువంటి ఆయుధాలు, టియర్ గ్యాస్ ఉపయోగించలేదన్నారు. ఒకరినొకరు తోసుకోవడం వల్ల ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఇప్పటి వరకు పోలీసులు 23 మందిని అదుపులోకి తీసుకున్నారని అధికారులు తెలిపారు. అయితే, పోలీసులు టియర్ గ్యాస్ క్యాన్లతోనే లోపలికి ప్రవేశించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నైట్ క్లబ్ యజమానిపై మహిళా మంత్రి రొసారియో ససియోటా మండిపడ్డారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన ఈ చర్యలకు పాల్పడినట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కారణంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితి కొనసాగుతుంటే ఇటువంటి చర్యలకు పాల్పడటం క్షమించరాని నేరమని అన్నారు. క్లబ్ యజమానిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.