యాప్నగరం

షాకింగ్ న్యూస్.. సౌదీ రాజకుటుంబంలో 150 మందికి కరోనా పాజిటివ్!

కరోనా వైరస్ రాజకుటుంబాలను సైతం వదలడం లేదు. ఇప్పటికే బ్రిటన్‌కు చెందిన ప్రిన్స్ చార్లెస్ కోవిడ్ బారిన పడగా.. తాజాగా సౌదీ రాజకుటుంబానికి చెందిన 150 మందికి ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 9 Apr 2020, 7:43 pm
సౌదీ అరేబియాలో రాజకుటుంబానికి చెందిన 150 మందికి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలుస్తోంది. రియాద్ గవర్నర్‌గా ఉన్న సౌదీ ప్రిన్స్ ఫైజల్ బిన్ బందర్ బిన్ అబ్దులాజిజ్ అల్ సౌద్‌కు కోవిడ్ సోకగా.. ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. రాయల్ ఫ్యామిలీ సభ్యులకు కోవిడ్ సోకడంతో.. కింగ్ ఫైజల్ స్పెషలిస్ట్ హాస్పిటల్‌లోని డాక్టర్లకు హాస్పిటల్ వర్గాలు హై అలర్ట్ జారీ చేశాయని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
Samayam Telugu Kingdom_Tower_AP


దేశవ్యాప్తంగా ఉన్న వీఐపీల కోసం సిద్ధంగా ఉండండని హాస్పిటల్ వర్గాలు డాక్టర్లకు ఆదేశాలు జారీ చేశాయి. ఎన్ని కేసులు నమోదవుతాయో తెలీదు కానీ హై అలర్ట్‌గా ఉన్నామని తెలిపారు. ఆ హాస్పిటల్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న పేషెంట్లను మరో చోటుకు తరలిస్తున్నారు.

84 ఏళ్ల కింగ్ సల్మాన్.. జెడ్డా సమీపంలోని ఎర్ర సముద్రంలో ఉన్న ఐలాంట్ ప్యాలెస్‌లో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఆయన కుమారుడు, కొందరు మంత్రులు కూడా ఇక్కడే ఉన్నారని తెలిపింది. ఇప్పటికే రాయల్ ఫ్యామిలీలో చాలా మందికి కరోనా సోకిందని ఆ కథనంలో పేర్కొన్నారు.

Read Also: కరోనా మృతుల ఖననం.. మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణRead Also: తెలంగాణలో 471 కరోనా కేసులు: ఈటల
Read Also: కారునే ఇల్లుగా మార్చుకొని.. పిల్లలకు దూరంగా.. కరోనాపై డాక్టర్ పోరాటం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.