యాప్నగరం

China పెను విషాదం: అగ్నికి ఆహుతైన రెస్టారెంట్‌.. 17 మంది సజీవదహనం

నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించడంతో పాటు అగ్ని ప్రమాదల నివారణకు ఏర్పాట్లు చేయకపోవడం వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకోవడం సాధారణంగా మారాయి. ముఖ్యంగా ఇటువంటి ప్రమాదాలకు చైనా హేతువుగా మారింది. అక్కడ తరుచూ ఏదో ఒక చోట భారీ అగ్ని ప్రమాదం జరిగి ప్రాణ, ఆస్తి నష్టం వాటిళ్లుతోంది. తాజాగా, ఈశాన్య చైనాలో బుధవారం ఓ రెస్టారెంట్ అగ్నికి ఆహుతయ్యింది. ఈ ఘటనలో భారీగా చనిపోయారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 28 Sep 2022, 5:11 pm

ప్రధానాంశాలు:

  • రెస్టారెంట్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
  • ఈశాన్య చైనాలోని చాంగ్‌చున్‌లో అగ్ని ప్రమాదం
  • ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్న అధికారులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం (Restaurant fire) సంభవించి 17 మంది సజీవదహనమైన విషాదకర ఘటన చైనాలో (China) చోటుచేసుకుంది. ఈశాన్య చైనాలో చాంగ్‌చున్‌ నగరంలోని ఓ రెస్టారెంట్‌‌లో (Changchun Restaurant) జరిగిన ఈ దుర్ఘటనలో 17మంది మృత్యువాత పడగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. చాంగ్‌చున్‌ నగరంలోని న్యూ ఏరియా ఇండస్ట్రియల్‌ జోన్‌లో ఈ దుర్ఘటన జరిగినట్టు జోన్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ సోషల్ మీడియా వేదిక విబోలో వెల్లడించింది. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియలేదని.. దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది.
చైనాలోని జిలిన్‌ ప్రావిన్సుల రాజధాని నగరం చాంగ్‌చున్‌ ఆటో ఉత్పత్తి కేంద్రంగా ప్రఖ్యాతిగాంచింది. చైనాలో తరచూ ఇటువంటి ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు, అగ్నిప్రమాదాల నివారించేలా ఏర్పాట్లు చేయకపోవడంతో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల హునాన్ ప్రావిన్స్‌లో భారీ ఆకాశహర్మ్యం ఒకటి అగ్నికీలల్లో చిక్కుకుని కాలి బూడిదైంది. హునాన్ ప్రావిన్స్ రాజధాని చంగ్సాలోని 42 అంతస్తుల టెలికం భవనంలో సెప్టెంబరు 16న మంటలు చెలరేగి క్రమంగా భీకరంగా మారాయి. అయితే, ఈ ఘటనలో ప్రాణహాని జరక్కపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

గతేడాది జులైలో ఈశాన్య ప్రావిన్సులు జిలిన్‌లో ఓ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించి 15 మంది ప్రాణాలు కోల్పోగా.. 25 మందికిపైగా గాయపడ్డారు. దీనికి నెల రోజుల ముందే సెంట్రల్ హెనన్ ప్రావిన్సుల్లోని మార్షల్ ఆర్ట్స్ స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 18 మంది సజీవదహనమయ్యారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు.
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.