యాప్నగరం

బస్సు లోయలో పడి 19 మంది మృతి

ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ 21 మంది మృత్యువు నుంచి బయటపడినప్పటికీ మరో 19 మంది మాత్రం అక్కడే తుది శ్వాస...

TNN 29 Apr 2017, 3:52 pm
బస్సు లోయలో పడి 19 మంది మృతి చెందిన దుర్ఘటన శనివారం మయన్మార్‌లో చోటుచేసుకుంది. సెంట్రల్ బాగో ప్రావిన్స్‌లో 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మ్యావడ్డీ వద్ద హైవే నుంచి అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ 21 మంది మృత్యువు నుంచి బయటపడినప్పటికీ మరో 19 మంది మాత్రం అక్కడే తుది శ్వాస విడిచారు. బ్రేక్ ఫెయిల్యూర్ వల్లే బస్సు అదుపుతప్పి వుంటుందని భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Samayam Telugu 19 killed after bus plunges into gorge myanmar
బస్సు లోయలో పడి 19 మంది మృతి


స్థానికుల సహాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకి తరలించి వారికి వైద్య సహాయం అందేందుకు స్థానికులు, పోలీసులు కృషిచేస్తున్నారు. ఇదిలావుండగానే మరోవైపు మృతిచెందిన వారి దహన సంస్కారాలకి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. థాయ్‌ల్యాండ్ సరిహద్దుల్లో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో థాయ్‌ల్యాండ్‌లోని మే సోట్ అనే నగరంలోని ఆస్పత్రిలోనూ ఏడుగురు క్షతగాత్రులకి చికిత్స అందిస్తున్నారు. మౌళిక వసతులు వెనుకబడిన మయన్మార్‌లో రహదారి వ్యవస్థ మరింత అస్తవ్యస్తంగా వుంది. దీంతో తరచుగా రోడ్డు ప్రమాదాలకి నిలయమైంది మయన్మార్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.