యాప్నగరం

అమెరికాలో దుండుగులు కాల్పులు.. భారత సంతతి యువకుడు మృతి

అమెరికాలో మరోసారి భారతీయ సంతతి విద్యార్ధిని లక్ష్యంగా చేసుకుని దుండుగులు కాల్పులకు పాల్పడ్డారు. కేరళలోకి కొల్లం జిల్లాకు చెందిన బాధితుడు తల్లిదండ్రులు ఉపాధి కోసం దాదాపు మూడు దశాబ్దాల కిందట అమెరికాకు వెళ్లారు. అక్కడ ఫిలడెల్ఫియాలో స్థిరపడ్డారు. అయితే, బాధితుడు ఓవైపు విద్యాభ్యాసం.. మరోవైపు పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 30 May 2023, 12:34 pm

ప్రధానాంశాలు:

  • చదువుకుంటూనే ఉద్యోగం చేస్తోన్న యువకుడు
  • ఆదివారం విధులు నుంచి వస్తుండగా కాల్పులు
  • దోపిడీకి ప్రయత్నించిన గుర్తుతెలియని వ్యక్తి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu USA Police
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో దుండుగులు జరిపిన కాల్పుల్లో మరో భారత సంతతి విద్యార్ధి మృతిచెందాడు. ఆదివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తుల జరిపిన కాల్పుల్లో చనిపోయిన యువకుడ్ని కేరళ సంతతికి చెందిన జుడే చాకోగా గుర్తించారు. కేరళలోని కొల్లం జిల్లాకు చెందిన బాధితుడి తల్లిదండ్రులు దాదాపు 30 ఏళ్ల కిందట అమెరికాకు వలస వెళ్లినట్టు మీడియా నివేదికలు వెల్లడించాయి. చదువును కొనసాగిస్తూనే చాకో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం విధులకు వెళ్లి తిరిగొస్తుండగా.. దుండుగులు మార్గమధ్యలో దాడికి పాల్పడ్డారు. దోచుకునే ప్రయత్నంలో కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు.

కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకూ అమెరికాలో గన్ కల్చర్‌కు ఇద్దరు భారతీయ విద్యార్ధులు బలైపోయారు. గత నెలలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్ధిని దుండుగులు కాల్చిచంపారు. అమెరికాలోని ఓహియోలో మాస్టర్స్ చేస్తోన్న ఏలూరు నగరానికి చెందిన సైయేశ్‌ వీర (24) ఏప్రిల్ 21న దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. పార్ట్-టైమ్ ఉద్యోగం చేస్తోన్న అతడు.. తాను పనిచేస్తోన్న పెట్రోల్‌ బంక్‌లో హత్యకు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేసరికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. నిందితుడి ఫోటోలను విడుదల చేసిన పోలీసులు.. అనుమానితుడ్ని గుర్తించడానికి సహకరించాలని కోరారు.

Read More Latest International News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.