China: ఉండేందుకు ఓ ఇల్లు లేక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది చైనాలో పందుల కోసం 26 అంతస్తుల అపార్ట్మెంట్ ఉంది. కేవలం పందుల పెంపకానికి ఇంత పెద్ద బిల్డింగ్ను నిర్మించారు. హుబీ ప్రావిన్స్లోని ఎజౌ పట్టణ శివార్లలో బిల్డింగ్ని కట్టించారు. పైగా పందుల కోసం నిర్మించిన భవనాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద భవనంగా దీనికి ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది. ఆ దేశంలో ప్రధాన మాంసాహారం పోర్క్. ఈ ఉత్పత్తిని పెంచడానికి పందులపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఈ భవనాన్ని కట్టారు. వాణిజ్యపరమైన ఎగుమతుల కోసం పందుల పెంపకంపై చైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందుకే ఇలా భారీ భవనాల్లో ఫార్మింగ్కు అవకాశం ఇచ్చింది. మొదట్లో రెండు, మూడు అంతస్తుల భవనాల్లో పందుల ఫార్మింగ్ చేసేవారు. ఇప్పుడు అది 26 అంతస్తులకు చేరింది.
ఈ బిల్డింగ్ల్లో పందులకు యంత్రాలే ఆహారాన్ని అందిస్తాయి. పందులకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ సోకకుండా అధునాతన పద్ధతులను అవలంభిస్తున్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని పందులను పెంచుతుంటారు. ఇంత పెద్ద భవనంలో నెలకు 54 వేల టన్నులు, ఏడాదికి 60 లక్షల టన్నుల పంది మాంసం ఉత్పత్తి జరుగుతుంది. ఇప్పుడు 6.5 లక్షల పందులను అక్కడ పెంచుతున్నారు. అలాగే ఈ పందుల వ్యర్థాలతో బయోగ్యాస్, విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు.
కాగా గతంలో యూరప్లోనూ ఇలాంటి నిర్మాణాలు చేపట్టారు. వివిధ కారణాలతో వాటిలో చాలా భవనాలు క్లోజ్ అయ్యాయి. అయితే జనావాసాల మధ్య ఇంత పెద్ద భవనాల్లో పందులు పెంపడం వల్ల నష్టాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ప్రజల్లో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
ఈ బిల్డింగ్ల్లో పందులకు యంత్రాలే ఆహారాన్ని అందిస్తాయి. పందులకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ సోకకుండా అధునాతన పద్ధతులను అవలంభిస్తున్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని పందులను పెంచుతుంటారు. ఇంత పెద్ద భవనంలో నెలకు 54 వేల టన్నులు, ఏడాదికి 60 లక్షల టన్నుల పంది మాంసం ఉత్పత్తి జరుగుతుంది. ఇప్పుడు 6.5 లక్షల పందులను అక్కడ పెంచుతున్నారు. అలాగే ఈ పందుల వ్యర్థాలతో బయోగ్యాస్, విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు.
కాగా గతంలో యూరప్లోనూ ఇలాంటి నిర్మాణాలు చేపట్టారు. వివిధ కారణాలతో వాటిలో చాలా భవనాలు క్లోజ్ అయ్యాయి. అయితే జనావాసాల మధ్య ఇంత పెద్ద భవనాల్లో పందులు పెంపడం వల్ల నష్టాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ప్రజల్లో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు.