మయన్మార్లో రోహింగ్యాలపై జరుగుతున్న దారుణాలో ఒక్కోటి వెలుగు చూస్తున్నాయి. అణచివేత, కిరాతక దాడులు, హత్యలే కాకుండా ఆ వర్గానికి చెందిన అమ్మాయిలు, మహిళలపై అనేక అఘాయిత్యాలకు పాల్పడ్డారు. తాజాగా మయన్మార్ భద్రతా దళాల చేతిలో దారుణంగా అత్యాచారానికి గురైన 29 మంది మహిళల ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాధితురాళ్లతో ఓ వార్తా ఛానెల్ ఇంటర్వ్యూ నిర్వహించి ప్రసారం చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వీరిలో చాలా మంది మైనర్ బాలికలు ఉన్నారు. వారిలో కొంత మంది గర్భం కూడా దాల్చారు. సామూహిక అత్యాచారాల తర్వాత సొంత కుటుంబ సభ్యులతోనూ ఛీత్కారాలకు గురై ఇంకా చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని బాధితులు పేర్కొన్నారు. ప్రస్తుతం వీరంతా బంగ్లాదేశ్కు పారిపోయి అక్కడ ఆశ్రయం పొందారు. పూర్తి వివరాలు వీడియోలో చూడొచ్చు..
29 మంది రోహింగ్యా మహిళలపై ఆర్మీ అఘాయిత్యం
మయన్మార్లో రోహింగ్యాలపై జరుగుతున్న దారుణాలో ఒక్కోటి వెలుగు చూస్తున్నాయి. అణచివేత, కిరాతక దాడులు, హత్యలే కాకుండా ఆ వర్గానికి చెందిన అమ్మాయిలు, మహిళలపై అనేక అఘాయిత్యాలకు పాల్పడ్డారు.
TNN 11 Dec 2017, 11:16 pm