యాప్నగరం

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి

ఇటీవల పిట్స్‌బర్గ్‌లో జరిగిన కాల్పులను మరవకముందే అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన ముగ్గురి ప్రాణాలు బలితీసుకుంది.

Samayam Telugu 3 Nov 2018, 3:57 pm
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటుచేసుకుంది. సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. అయితే కాల్పుల అనంతరం దుండగుడు తనను తాను అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్లోరిడా రాష్ట్ర రాజధాని టల్లహస్సీలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
Samayam Telugu Florida yoga studio


ఇటీవల పిట్స్‌బర్గ్‌లో జరిగిన కాల్పులను మరవకముందే అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన ముగ్గురి ప్రాణాలు బలితీసుకుందని టల్లహస్సీ పోలీస్ చీఫ్ మైఖెల్ డెలియో తెలిపారు. టల్లహస్సీలోని యోగా స్టూడియోలోకి శుక్రవారం రాత్రి ఓ సాయుధుడు చోరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. బుల్లెట్ గాయాలతో పడిఉన్న మరికొందరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తనకోసం గాలిస్తారన్న భయంతో నిందితుడు అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని డెలియో వివరించారు.

షాపింగ్ మాల్‌లో యోగా సెంటర్ ఉండటంతో కాల్పుల ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దుండగుడు కాల్పులు జరుపుతుండగా అడ్డుకునేందుకు వచ్చిన వారిని తుపాకీతో బెదిరించాడని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఇటీవల పిట్స్‌బర్గ్‌లోని యూదుల ప్రార్థనా మందిరంపై జరిగిన కాల్పుల ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.