యాప్నగరం

బ్రిటన్ దాడి: ఐదుగురు మృతి, 40 మందికి గాయాలు

బ్రిటన్ పార్లమెంట్ ఎదుట జరిగిన దాడిలో మొత్తం ఐదుగురు చనిపోగా దాదాపు 40 మంది వరకు గాయపడినట్టు..

TNN 23 Mar 2017, 11:01 am
బ్రిటన్ పార్లమెంట్ ఎదుట జరిగిన దాడిలో మొత్తం ఐదుగురు చనిపోగా దాదాపు 40 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. వెస్ట్ మినిష్టర్ బ్రిడ్జ్‌‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన నిందితుడు ఆ తర్వాత ఓ పోలీస్ ఆఫీసర్‌ని పొడిచి చంపారు. దాడి అనంతరం ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దాడికి పాల్పడిన నిందితుడిని కాల్చిచంపారు. ముగ్గురు పోలీసులు, స్కూల్ ట్రిప్‌పై లండన్ వచ్చిన కొంతమంది ఫ్రెంచ్ టీనేజర్స్, ఇద్దరు రూమేనియన్ పర్యాటకులు, మరో ఐదుగురు దక్షిణ కొరియాకి చెందిన సందర్శకులు ఈ దాడిలో గాయపడిన వారిలో వున్నారు. ఈ దాడిని అనైతికమైన ఉగ్రదాడిగా అభివర్ణించిన బ్రిటన్ ప్రధాని థెరెసా మే.. ఉగ్రవాదుల చర్యల్ని తీవ్రంగా ఖండించారు.
Samayam Telugu 5 dead and 40 wounded in attack at british parliament
బ్రిటన్ దాడి: ఐదుగురు మృతి, 40 మందికి గాయాలు


దాడికి పాల్పడిన నిందితుడిని హతమార్చిన అనంతరం బ్రిటన్ పార్లమెంట్ సమావేశాలకి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, నేతలు, సిబ్బంది, సందర్శకులకి భద్రత కల్పించేపనిలో నిమగ్నమయ్యారు అక్కడి పోలీసులు. బ్రిటన్ పార్లమెంట్‌కి దారి తీసే ప్రవేశానికి కొద్ది దూరంలోనే జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా లండన్‌ని ఉలిక్కిపడేలా చేసింది.

ఈ దాడులకి బాధ్యత వహిస్తున్నట్టుగా ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించనప్పటికీ, దీనిని తాము ఉగ్రదాడిగానే భావిస్తున్నట్టు బ్రిటన్ పోలీసులు అభిప్రాయపడ్డారు. ఇటువంటి అనైతిక దాడులతో బ్రిటన్ ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని ఎవ్వరూ దెబ్బతీయలేరు అని ప్రకటించిన ప్రధాని మే.. రేపు పార్లమెంట్ సమావేశాలు యధావిధిగా జరుగుతాయని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.