యాప్నగరం

పాక్‌లో 50 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్... 525 మంది క్వారంటైన్‌కు

ఇటలీ నుంచి తీసుకొచ్చిన ఓ ఖైదీ కారణంగా పాకిస్థాన్‌లో 50 మంది ఖైదీలు కరోనా బారిన పడ్డారు. దీంతో అక్కడి అధికారులు తలలు పట్టుకున్నారు. సుమారు 525 మంది ఖైదీలను క్వారంటైన్‌కు పంపారు.

Samayam Telugu 8 Apr 2020, 10:20 am
పాకిస్థాన్‌లో కరోనా వైరస్ వణికిస్తోంది. వేల సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడుతుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా జైళ్లలోని 50 మంది ఖైదీలకు కరోనా సోకడం సంచలనం రేపింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని ఓ జైలులో 50 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. దీంతో వారందరినీ కరోనా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన 525 మంది ఇతర ఖైదీలను ప్రత్యేక గదులకు తరలించామని పాక్ జైళ్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ షాహిద్ బేగ్ చెప్పారు.
Samayam Telugu images (2)


Also Read: లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఇంట్లో ఉండలేక ఏడుగురు ఆత్మహత్యాయత్నం

ఇటలీలో డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడిన పాక్‌ పౌరుడిని ఇటీవలే స్వదేశానికి తీసుకొచ్చి జైలులో పెట్టారు. అయితే అతడికి ఎలాంటి పరీక్షలు చేయకుండానే అందరి ఖైదీల మధ్య ఉంచడమే ఇప్పుడు కొపముంచింది. ఆ ఖైదీ ద్వారానే ఇప్పుడు 50 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో అధికారులు షాకయ్యారు. కరోనా వైరస్ ప్రబలుతుందనే భయంతో లాహోర్ క్యాంపు జైలులో ఉన్న 800మంది ఖైదీలను ఇతర జైళ్లకు తరలించినట్లు పాక్ జైలు అధికారులు చెప్పారు. దేశంలోని 41 జైళ్లలో ఖైదీలతో ములాఖత్‌ను ఇప్పటికే నిషేధించినట్లు హోంశాఖ అధికారులు తెలిపారు.

Also Read: న్యూయార్క్‌లో కరోనా కాటు: ప్రముఖ తెలుగు జర్నలిస్ట్ మృతి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.