యాప్నగరం

సిరియాలో 68 మంది చిన్నారుల ఊచకోత

అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో మరో ఘోర సంఘటన చోటు చేసుకుంది.

TNN 16 Apr 2017, 8:01 pm
అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో మరో ఘోర సంఘటన చోటు చేసుకుంది. సిరియా ప్రభుత్వం బస్సుల్లో తరలిస్తున్న శరణార్థులపై ఉగ్రవాదులు బాంబు దాడి చేశారు. ఈ దాడిలో 68 మంది చిన్నారుల సహా 126 మంది దుర్మరణం చెందారు. కారు నిండా పేలుడు పదార్థాలను నింపుకున్న ఉగ్రవాదులు శరణార్థుల బస్ కాన్వాయ్‌ని బలంగా ఢీకొట్టారు. దీంతో పెద్ద పేలుడు సంభవించింది. దీంతో ఆ ప్రాంతమంతా రక్తపు మరకలతో ఎరుపెక్కింది. బస్సుల్లో చిన్నారుల ​ మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
Samayam Telugu 68 children among dead in bomb attack on syria evacuees
సిరియాలో 68 మంది చిన్నారుల ఊచకోత


అలెప్పో పట్టణ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో మూడు బస్సులు కాలి బూడిదయ్యాయి. సిరియా రెబెల్స్ చేసిన ఈ ఆత్మహుతి దాడిలో కొన్ని వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అలెప్పో ప్రాంతంలోకి రెబెల్స్ వాహనం ఎలా ప్రవేశించింది అని మానవ హక్కుల సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి ఫువా, కఫ్రాయా, మడాయా, జబదని పట్టణాల నుంచి శరణార్థులను పెద్ద ఎత్తున్న ప్రభుత్వం బస్సుల్లో తీసుకొస్తోంది. పక్కా ప్రణాళికతో ఈ కాన్వాయ్‌పై దాడిచేసిన రెబల్స్ తీవ్ర ప్రాణ నష్టాన్ని కలిగించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.