లండన్లో జరిగిన ప్రపంచస్థాయి గణిత పోటీల్లో భారత సంతతి బాలిక సత్తా చాటింది. న్యూదిల్లీలో జన్మించిన ఎనిమిదేళ్ల చిన్నారి సోహినిరాయ్ చౌదరి ప్రతిష్టాత్మక ''మ్యాథ్లెటిక్స్ హాల్ ఆఫ్ ఫేమ్''లోకి ప్రవేశించిన బాలికగా ఘనత సాధించింది. ప్రైమరీ స్కూల్ విద్యార్థుల కోసం నిర్వహించిన గణిత ఆధారిత ఆన్లైన్ పోటీల్లో బర్మింగ్హమ్లోని నెల్సన్ ప్రైమరీ స్కూల్ తరఫున ఆమె పోటీల్లో పాల్గొంది. బ్రిటన్, ఇతర దేశాలకు చెందిన దాదాపు 100 మంది విద్యార్థులతో పోటీపడి.. ప్రతిష్టాత్మక ''మ్యాథ్లెటిక్స్ హాల్ ఆఫ్ ఫేమ్''లో చోటు సంపాందించింది. మ్యాథమెటికల్ పజిల్స్ను వేగంగా, కచ్చితత్వంతో పూర్తిచేసి తన ప్రతిభను చాటుకుంది.
తన కూతురు ఈ ఘనత సాధించడం పట్ల సోహిని తండ్రి మైనక్ రాయ్ చౌదరి హర్షం వ్యక్తంచేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''ఈ ఘనత సాధించడం పట్ల నా కూతురు చాలా సంతోషంగా ఉంది. సొహినీ ముత్తాత డీఎన్ రాయ్ స్కాట్లాండ్లో లోకోమోటివ్ ఇంజినీరింగ్ పూర్తిచేసి, ఇండియన్ రైల్వేలో పనిచేశాడు. బహుశా ఆయన వారసత్వంగానే తనకు గణితం పట్ల ఆసక్తి కలిగిందేమో" అని అన్నారు.
ప్రైమరీ స్కూల్ మ్యాథ్స్ కరిక్యులమ్ ఆధారంగా విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 'లైవ్ మెంటల్ అరిథ్మెటిక్ గేమ్స్' ద్వారా విద్యార్ధుల ప్రతిభను అంచనావేశారు. సొహినీ స్కూల్ టీచర్ స్పందిస్తూ... ఈ ఘనత సాధించడం వెనుక తన కఠోర శ్రమ ఉందని, నేర్చుకున్న ప్రతి అంశాన్ని ఆచరణలో పెట్టేదని తెలిపింది.
డాక్టర్ కావాడమే తన లక్ష్యమని సొహినీ తెలిపింది.
తన కూతురు ఈ ఘనత సాధించడం పట్ల సోహిని తండ్రి మైనక్ రాయ్ చౌదరి హర్షం వ్యక్తంచేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''ఈ ఘనత సాధించడం పట్ల నా కూతురు చాలా సంతోషంగా ఉంది. సొహినీ ముత్తాత డీఎన్ రాయ్ స్కాట్లాండ్లో లోకోమోటివ్ ఇంజినీరింగ్ పూర్తిచేసి, ఇండియన్ రైల్వేలో పనిచేశాడు. బహుశా ఆయన వారసత్వంగానే తనకు గణితం పట్ల ఆసక్తి కలిగిందేమో" అని అన్నారు.
ప్రైమరీ స్కూల్ మ్యాథ్స్ కరిక్యులమ్ ఆధారంగా విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 'లైవ్ మెంటల్ అరిథ్మెటిక్ గేమ్స్' ద్వారా విద్యార్ధుల ప్రతిభను అంచనావేశారు. సొహినీ స్కూల్ టీచర్ స్పందిస్తూ... ఈ ఘనత సాధించడం వెనుక తన కఠోర శ్రమ ఉందని, నేర్చుకున్న ప్రతి అంశాన్ని ఆచరణలో పెట్టేదని తెలిపింది.
డాక్టర్ కావాడమే తన లక్ష్యమని సొహినీ తెలిపింది.