యాప్నగరం

coronavirus: వెంటిలేటర్ వద్దన్న బామ్మ.. కంటతడి పెట్టిస్తున్న ఘటన

కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. అయితే అదే స్థాయిలో వైద్య సదుపాయాలు లేవన్నది కలవరపరచే అంశం. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం మెడికల్ ఎక్విప్‌మెంట్‌కి కొరత ఉంది. అది తెలిసిన ఓ బామ్మ తన ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన ఘటన కంటతడి పెట్టిస్తోంది.

Samayam Telugu 1 Apr 2020, 6:42 pm
శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడంతో ఆస్పత్రిలో చేరిన ఆ బామ్మకి కరోనా వైరస్ సోకిందన్న భయంకర నిజం తెలిసింది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే సరైన వైద్య సదుపాయాలు అందక.. అన్ని వైద్య పరికరాలు అందుబాటులో లేక ఎక్కువ మంది చనిపోతున్నారన్న విషయం ఆమెని కలచివేసింది. అలాంటి పరిస్థితుల్లో తన ప్రాణాలు పోయినా ఫర్వాలేదని నిర్ణయించుకున్న ఆమె.. త్యాగానికి సిద్ధపడింది. తృణప్రాయంగా తన ప్రాణాలు వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. హృదయాలను పిండేస్తున్న ఈ ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది.
Samayam Telugu coronavirus2


బ్రెజిల్‌కి చెందిన సుజానె హయ్‌లార్ట్స్ వయస్సు 90 ఏళ్లు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుండడంతో ఇటీవల ఆస్పత్రిలో చేరింది. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. అనంతరం ఆమెని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే కరోనా మరణాలు ఆమెని తీవ్రంగా కలచివేశాయి. వైరస్ బారిన పడి యువత చనిపోవడం ఎక్కువ బాధించి ఆమె కఠిన నిర్ణయం తీసుకుంది.

Also Read: కర్నూల్‌: ఢిల్లీ ప్రార్థనలకి వెళ్లొచ్చిన వ్యక్తి మృతి

వెంటిలేటర్ పెట్టేందుకు సిద్ధమైన డాక్టర్లకు కంటతడి పెట్టించింది. ‘ నేను చాలా మంచి జీవితం గడిపాను. నాకు వెంటిలేటర్ అవసరం లేదు. అది కరోనాతో బాధపడుతున్న యువతకు, ఉపయోగపడుతుంది. చిన్న వయస్సు వారిని బతికించండి’ అంటూ తోసిపుచ్చింది. అనంతరం రెండు రోజులకు సుజానె కన్నుమూయడం ప్రతి ఒక్కరి హృదయాలను బరువెక్కించింది. మరో ప్రాణం కాపాడడం కోసం తన ప్రాణాలు వదిలేసి ఆమె చేసిన త్యాగం కంటతడి పెట్టించింది.

Read Also: కరోనా పేషెంట్ల ఇళ్లలో లూటీ.. కిటికీలు పగలగొట్టి దొంగల బీభత్సం

యూకే‌లో ఇప్పటికే కరోనా వైరస్ విరుచుకుపడుతోంది. బెల్జియంలో ఇప్పటికి 700కు పైగా మరణాలు నమోదయ్యాయి. సుమారు 12,775 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, వెయ్యి మందికి పైగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. యూకేలో 12, 13 ఏళ్ల వయసున్న టీనేజర్లు కరోనా వైరస్ కారణంగా మరణించారు.

Also Read: కరోనా క్లియరెన్స్ సర్టిఫికెట్.. సైబర్ కేటుగాళ్ల ఖతర్నాక్ దోపిడీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.