గతేడాది అఫ్గనిస్థాన్లో రెండోసారి అధికారాన్ని చేపట్టిన తాలిబన్లు.. తొలినాళ్లలో ఇచ్చిన హామీలన్నీ నీటమీద రాతలేనని తేలిపోయాయి. సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పి మాట తప్పిన తాలిబన్లు.. తాజాగా, బాలికల విద్యపై విషయంలో యూటర్న్ తీసుకున్నారు. అంతర్జాతీయ సమాజం తమ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు వీలుగా పలు సంస్కరణలు చేపడుతున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. ఇందులో భాగంగానే బాలికల చదువుకు కూడా అనుమతిస్తున్నట్లు ఇటీవలే ప్రకటన చేశారు. అయితే, ఇప్పుడు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో మాట మార్చేశారు. బాలికలను ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించబోమని, ఆరో తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మహిళలకు విద్య, ఉద్యోగాల విషయంలో పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని అంతర్జాతీయ సమాజం డిమాండ్ చేస్తోంది. తాలిబన్లు ఇందుకు అంగీకరించినా ఇప్పుడు చివరి నిమిషంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. దీనికి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలే కారణమని తెలుస్తోంది.
తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు అక్కడి గిరిజనులు విముఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బాలికలకు ఉన్నత విద్యను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నిషేధం తాత్కాలికమే అని, భవిష్యత్తులో వారిని అనుమతించే అవకాశం ఉందని తాలిబన్ అధికారి ఒకరు చెప్పారు. బుధవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కాగా.. ఎంతో సంతోషంగా వెళ్లిన బాలికలను వెనక్కు పంపడంతో వారు నిరాశకు గురయ్యారు.
రాజధాని కాబూల్ పరిసరాల్లోని పాఠశాలలకు చెందిన టీచర్లు, విద్యార్థులు మాట్లాడుతూ.. అమ్మాయిలు ఎంతో ఉత్సాహంతో వచ్చారని, కానీ ఇంతలోనే వెనక్కు వెళ్లిపోవాలని చెప్పడంతో కన్నీళ్లు పెట్టుకుంటూ వెనుదిరిగారని తెలిపారు. ‘‘స్కూల్కు రావద్దని ప్రిన్సిపాల్ చెప్పడంతో మేము చాలా నిరుత్సాహానికి గురయి నిస్సహాయంగా మారిపోయాం.. మాకు కన్నీళ్లు ఆగడం లేదు’’ అని ఓ విద్యార్థి వాపోయింది. గతంలో 1996 నుంచి 2001 వరకు అధికారంలో ఉన్న తాలిబన్లు బాలికల విద్యను నిషేధించారు.
ఉన్నత పాఠశాల స్థాయి బాలికల విద్యపై కొద్ది నెలలు నిషేధం తర్వాత బాలబాలికలందరికీ బుధవారం నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయని గతవారం అఫ్గన్ విద్యా శాఖ ప్రకటించింది. మంగళవారం సాయంత్రం సైతం విద్యా శాఖ అధికార ప్రతినిధి ఓ వీడియో సందేశంలో విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంతలోనే బుధవారం ఉదయం ఏం జరిగిందో తెలియదు కానీ, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ బాలికలకు పాఠశాలల్లోకి ప్రవేశం లేదని ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆరో తరగతి దాటిన విద్యార్ధినులను పాఠశాలలోకి అనుమతించవద్దని నోటీసుల్లో పేర్కొనారు. దీనిపై విద్యా శాఖ అధికార ప్రతినిధి సంప్రదించడానికి రాయిటర్స్ ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. తాలిబన్లు అధికారం చేపట్టినప్పటి నుంచి సీనియర్ నేతల మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. కొందరు కఠిన పాలనకే మొగ్గు చూపుతుంటే.. మరికొందరు మాత్రం సంస్కరణలు చేపట్టడం అవసరమని వాదిస్తున్నారు. ప్రజలపై, ముఖ్యంగా మహిళలపై విధించిన ఆంక్షలను సడలించాలని వారు పట్టుబడుతున్నారు.
తాలిబన్ల నిర్ణయంపై అఫ్గన్లో ఐక్యరాజ్యసమితి మిషన్, అమెరికాలు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. తాలిబన్ల ప్రకటనలు, హామీలకు భిన్నంగా ఈ నిర్ణయం ఉందని, తమను నిరుత్సాహానికి గురిచేసిందని అఫ్గన్లో అమెరికా ప్రతినిధది ఐయాన్ మెక్క్యారీ వ్యాఖ్యానించారు.
తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు అక్కడి గిరిజనులు విముఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బాలికలకు ఉన్నత విద్యను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నిషేధం తాత్కాలికమే అని, భవిష్యత్తులో వారిని అనుమతించే అవకాశం ఉందని తాలిబన్ అధికారి ఒకరు చెప్పారు. బుధవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కాగా.. ఎంతో సంతోషంగా వెళ్లిన బాలికలను వెనక్కు పంపడంతో వారు నిరాశకు గురయ్యారు.
రాజధాని కాబూల్ పరిసరాల్లోని పాఠశాలలకు చెందిన టీచర్లు, విద్యార్థులు మాట్లాడుతూ.. అమ్మాయిలు ఎంతో ఉత్సాహంతో వచ్చారని, కానీ ఇంతలోనే వెనక్కు వెళ్లిపోవాలని చెప్పడంతో కన్నీళ్లు పెట్టుకుంటూ వెనుదిరిగారని తెలిపారు. ‘‘స్కూల్కు రావద్దని ప్రిన్సిపాల్ చెప్పడంతో మేము చాలా నిరుత్సాహానికి గురయి నిస్సహాయంగా మారిపోయాం.. మాకు కన్నీళ్లు ఆగడం లేదు’’ అని ఓ విద్యార్థి వాపోయింది. గతంలో 1996 నుంచి 2001 వరకు అధికారంలో ఉన్న తాలిబన్లు బాలికల విద్యను నిషేధించారు.
ఉన్నత పాఠశాల స్థాయి బాలికల విద్యపై కొద్ది నెలలు నిషేధం తర్వాత బాలబాలికలందరికీ బుధవారం నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయని గతవారం అఫ్గన్ విద్యా శాఖ ప్రకటించింది. మంగళవారం సాయంత్రం సైతం విద్యా శాఖ అధికార ప్రతినిధి ఓ వీడియో సందేశంలో విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంతలోనే బుధవారం ఉదయం ఏం జరిగిందో తెలియదు కానీ, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ బాలికలకు పాఠశాలల్లోకి ప్రవేశం లేదని ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆరో తరగతి దాటిన విద్యార్ధినులను పాఠశాలలోకి అనుమతించవద్దని నోటీసుల్లో పేర్కొనారు. దీనిపై విద్యా శాఖ అధికార ప్రతినిధి సంప్రదించడానికి రాయిటర్స్ ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. తాలిబన్లు అధికారం చేపట్టినప్పటి నుంచి సీనియర్ నేతల మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. కొందరు కఠిన పాలనకే మొగ్గు చూపుతుంటే.. మరికొందరు మాత్రం సంస్కరణలు చేపట్టడం అవసరమని వాదిస్తున్నారు. ప్రజలపై, ముఖ్యంగా మహిళలపై విధించిన ఆంక్షలను సడలించాలని వారు పట్టుబడుతున్నారు.
తాలిబన్ల నిర్ణయంపై అఫ్గన్లో ఐక్యరాజ్యసమితి మిషన్, అమెరికాలు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. తాలిబన్ల ప్రకటనలు, హామీలకు భిన్నంగా ఈ నిర్ణయం ఉందని, తమను నిరుత్సాహానికి గురిచేసిందని అఫ్గన్లో అమెరికా ప్రతినిధది ఐయాన్ మెక్క్యారీ వ్యాఖ్యానించారు.