యాప్నగరం

China Virus: కరోనా విజృంభణ వేళ.. చైనాలో మరో వైరస్ గుర్తింపు

CoronaVirus | కరోనా వైరస్ ఓవైపు వణికిస్తుండగానే.. చైనాలో మరో వైరస్ వెలుగు చూసింది. హునాయ్ ప్రావిన్స్‌లో H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ వెలుగు చూసింది. దీని ప్రభావంతో 4500 కోళ్లు చనిపోయాయి.

Samayam Telugu 2 Feb 2020, 5:50 pm
కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే విలవిల్లాడుతున్న చైనాను ఇప్పుడు మరో వైరస్ భయపెడుతోంది. హానికర బర్డ్ ప్లూ వైరస్ ఆనవాళ్లను చైనాలో గుర్తించారు. ఈ విషయాన్ని ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. దక్షిణ ప్రావిన్స్ హునాన్‌లోని షావోయాంగ్ సిటీలో వెలుగు చూసిన H5N1 బర్డ్ ప్లూ కారణంగా ఇప్పటికే 4500 కోళ్లు చనిపోయాయి. 17 వేలకుపైగా కోళ్లను అధికారులు చంపేశారు.ముందు జాగ్రత్త చర్యగా చైనీస్ అధికారులు కోళ్ల ఫారాన్ని మూసివేశారు. ప్లూ వ్యాప్తి చెందకుండా ఆ ప్రాంతాన్ని స్టెరిలైజ్ చేశారు. ఇప్పటి వరకైతే ఈ వైరస్ మనుషులకు సోకలేదు. కరోనా వైరస్ సోకిన వుహాన్‌కు షావోయాంగ్ దక్షిణాన ఉంటుంది.
Samayam Telugu corona virus


H5N1ను అత్యంత హానికర వైరస్‌గా గుర్తించారు. ఈ వైరస్ బారిన పడి ప్రపంచంలో అనేక మంది చనిపోయారు. వైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడిన పక్షులను తాకితే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. కానీ ఇది మనుషులకు అంత తేలికగా సోకదు. ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి చెందదు. ఈ వైరస్ బారిన పడ్డ వారు చనిపోయే అవకాశం 60 శాతం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఇప్పటి వరకూ కరోనా వైరస్ కారణంగా చైనాలో 300 మందికిపైగా చనిపోయారు. దాదాపు 15 వేల మంది ఈ వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. భారత్‌లోనూ రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ 25 దేశాల్లో కరోనా కేసులను గుర్తించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.