భారత్లో అన్లాక్-2 అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రధాని మోదీ మంగళవారం (జూన్ 30) సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బయటకెళ్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని చెప్పారు. గ్రామ సర్పంచ్ నుంచి దేశ ప్రధాని వరకు చట్టానికి ఎవరూ అతీతులు కాదని చెప్పుకొచ్చారు. లాక్డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ.. నిబంధనలు అతిక్రమించిన ఓ దేశ ప్రధాని ఏకంగా రూ.13 వేలు జరిమానా కట్టారంటూ మోదీ చెప్పారు. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రధాని ఎవరా అంటూ నెటిజన్లు గూగుల్ను జల్లెడ పడుతున్నారు.
బల్గేరియా ప్రధాని బోయ్కో బొరిసోవ్కు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు ఇటీవల 300 లెవ్స్ (రూ.13 వేలు) జరిమానా విధించారు. బొరిసోవ్ ఇటీవల ఓ చర్చిని సందర్శించడానికి వెళ్లిన సమయంలో ముఖానికి మాస్క్ ధరించకపోవడమే అందుక్కారణం. ప్రధానికే కాదు.. ఆయనతో పాటు వెళ్లిన కొంత మంది జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు, కెమెరామెన్లకు కూడా భారీగా జరిమానా విధించారు.
కరోనా కట్టడి కోసం బల్గేరియా అనుసరిస్తున్న కఠిన నిబంధనలకు ఈ ఘటన ఓ చిన్న ఉదాహరణ మాత్రమే. యూరప్ ఖండంలోని ఓ చిన్న దేశమైన బల్గేరియా తమ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కఠిన ఆంక్షలు విధించింది. 69,48,445 మంది జనాభా ఉన్న ఆ దేశంలో కరోనా నియంత్రణకు లాక్డౌన్ విధించారు. ప్రజలు మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా కఠిన నిబంధనలను అమలు చేశారు. బస్సులు, రైళ్లు, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించడం తప్పనిసరి చేశారు. ఈ నిబంధనలను అతిక్రమించిన వారికి కఠిన శిక్షలు విధిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ దేశ ప్రధానికి కూడా జరిమానా విధించారు.
బల్గేరియా ప్రధానికి మాత్రమే కాదు, ఆ దేశంలో అధికార పార్టీకి కూడా భారీ జరిమానా పడింది. అధికార గెర్బ్ పార్టీ ఇటీవల భారీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో భౌతిక దూరం నిబంధనలను అతిక్రమించినట్లు తేలడంతో 3 వేల లెవ్లు (రూ.1,30,228) జరిమానాగా విధించారు. ఇదే కారణంతో ప్రతిపక్ష సోషలిస్టు పార్టీకి కూడా ఇంతే మొత్తం జరిమానా విధించడం గమనార్హం.
Photo Credit: Novinite.com
నిబంధనలు కఠినంగా అమలు చేయడం ద్వారానే కొవిడ్ మహమ్మారిని బల్గేరియా దీటుగా ఎదుర్కోగలిగింది. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో లాక్డౌన్ నిబంధనలను సడలించింది. అయితే.. గత వారం కొత్తగా 606 కేసులు రావడంతో మరోసారి అప్రమత్తమైంది. బల్గేరియాలో మొత్తం 3984 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా ఆ దేశంలో 207 మంది మరణించారు.
Don't Miss: చైనా యాప్స్కు ప్రత్యామ్నాయం ఇవే..
Also Read: కరోనా మృతదేహాలను గుంత తీసి విసిరేస్తూ.. షాకింగ్ వీడియో, బళ్లారిలో దారుణం
బల్గేరియా ప్రధాని బోయ్కో బొరిసోవ్కు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు ఇటీవల 300 లెవ్స్ (రూ.13 వేలు) జరిమానా విధించారు. బొరిసోవ్ ఇటీవల ఓ చర్చిని సందర్శించడానికి వెళ్లిన సమయంలో ముఖానికి మాస్క్ ధరించకపోవడమే అందుక్కారణం. ప్రధానికే కాదు.. ఆయనతో పాటు వెళ్లిన కొంత మంది జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు, కెమెరామెన్లకు కూడా భారీగా జరిమానా విధించారు.
కరోనా కట్టడి కోసం బల్గేరియా అనుసరిస్తున్న కఠిన నిబంధనలకు ఈ ఘటన ఓ చిన్న ఉదాహరణ మాత్రమే. యూరప్ ఖండంలోని ఓ చిన్న దేశమైన బల్గేరియా తమ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కఠిన ఆంక్షలు విధించింది. 69,48,445 మంది జనాభా ఉన్న ఆ దేశంలో కరోనా నియంత్రణకు లాక్డౌన్ విధించారు. ప్రజలు మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా కఠిన నిబంధనలను అమలు చేశారు. బస్సులు, రైళ్లు, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించడం తప్పనిసరి చేశారు. ఈ నిబంధనలను అతిక్రమించిన వారికి కఠిన శిక్షలు విధిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ దేశ ప్రధానికి కూడా జరిమానా విధించారు.
బల్గేరియా ప్రధానికి మాత్రమే కాదు, ఆ దేశంలో అధికార పార్టీకి కూడా భారీ జరిమానా పడింది. అధికార గెర్బ్ పార్టీ ఇటీవల భారీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో భౌతిక దూరం నిబంధనలను అతిక్రమించినట్లు తేలడంతో 3 వేల లెవ్లు (రూ.1,30,228) జరిమానాగా విధించారు. ఇదే కారణంతో ప్రతిపక్ష సోషలిస్టు పార్టీకి కూడా ఇంతే మొత్తం జరిమానా విధించడం గమనార్హం.
Photo Credit: Novinite.com
నిబంధనలు కఠినంగా అమలు చేయడం ద్వారానే కొవిడ్ మహమ్మారిని బల్గేరియా దీటుగా ఎదుర్కోగలిగింది. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో లాక్డౌన్ నిబంధనలను సడలించింది. అయితే.. గత వారం కొత్తగా 606 కేసులు రావడంతో మరోసారి అప్రమత్తమైంది. బల్గేరియాలో మొత్తం 3984 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా ఆ దేశంలో 207 మంది మరణించారు.
Don't Miss: చైనా యాప్స్కు ప్రత్యామ్నాయం ఇవే..
Also Read: కరోనా మృతదేహాలను గుంత తీసి విసిరేస్తూ.. షాకింగ్ వీడియో, బళ్లారిలో దారుణం