యాప్నగరం

నిరాశకు గురిచేసే వార్త.. అమెరికాలో అర్ధాంతరంగా నిలిచిపోయిన మరో టీకా ట్రయల్స్

ప్రపంచానికి కంటిమీద కునుకులేకండా చేస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం ముమ్మరంగా పరిశోధనలు సాగిస్తుండగా మరో నిరుత్సాహానికి గురిచేసే వార్త బయటకి వచ్చింది.

Samayam Telugu 14 Oct 2020, 2:33 pm
ఆహోరాత్రుల శ్రమిస్తూ వీలైనంత తొందరగా కరోనా మహమ్మారిని నిలువరించే టీకాను తీసుకురావాలని శాస్త్రవేత్తలు కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే, శాస్త్రవేత్తల ప్రయత్నంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. వాలంటీర్‌లో అంతుచిక్కని అనారోగ్య సమస్య తలెత్తడంతో క్లినికల్ ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్టు ‘జాన్సన్ అండ్ జాన్సన్’ వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా, మరో సంస్థ సైతం ఇదే కారణంతో టీకా ట్రయల్స్‌ను నిలిపివేసింది. దీంతో మహమ్మారిపై శాస్త్రవేత్తలు చేస్తున్న సుదీర్ఘ పోరాటంలో ఎదురుదెబ్బ తగిలింది.
Samayam Telugu కరోనా వైరస్ వ్యాక్సిన్
coronavirus Vaccine


Read Also: గట్టిగానే దెబ్బకొట్టిన కరోనా.. తలసరి జీడీపీలో బంగ్లాదేశ్ వెనుక భారత్!

జాన్సన్ అండ్ జాన్సన్ నుంచి ప్రకటన వెలువడిన 24 గంటల్లోనే ఈ సంస్థ కూడా ప్రయోగాలు తాత్కాలికంగా నిలిపివేయడం గమనార్హం.
అమెరికాకు చెందిన ఎలి లిల్లీ ఫార్మా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ మంగళవారం అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అంతుచిక్కని అనారోగ్య సమస్యలు తలెత్తడంతోనే ప్రయోగాలు నిలిపివేసిసట్టు ప్రకటించింది. చివరి దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఇటువంటి అవాంతరాలు తలెత్తడం అసాధారణం కాదు.

Read Also: ఒక్క యాడ్‌..పెను దుమారం: అటు విమర్శలు, ఇటు ప్రశంసలు.. చివరికిలా

వాస్తవానికి, చాలా అరుదుగా ఉండే దుష్ప్రభావాలను గుర్తించడానికే వేలాది మందిని మూడో దశ ట్రయల్స్‌కు అనుమతిస్తారు. గత నెలలో ఆక్స్‌ఫర్డ్‌- ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ కూడా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. టీకా తీసుకున్న వాలంటీర్‌కు వెన్నుముక సమస్యలు తలెత్తడంతో బ్రిటన్‌లో క్లినికల్ ట్రయల్స్ నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఆశలు రేపిన తరుణంలో క్లినికల్ ట్రయల్స్ నిలిపేస్తున్నట్లు వచ్చిన ప్రకటన తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది.

Read Also: అర్ధరాత్రి అంత్యక్రియలు మానవహక్కుల ఉల్లంఘనే.. హథ్రాస్ కేసులో హైకోర్టు

అయితే.. ఎలాంటి ఇబ్బందులు లేవని తేలడంతో ప్రయోగాలను తిరిగి ప్రారంభించారు. ఎలి లిల్లీ ఫార్మా టీకా క్లినికల్ ట్రయల్స్ నిలిచిపోవడంపై స్క్రిప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్త ఎరిక్ టోపాల్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. భద్రతా కారణంతో లిల్లీ యాంటీ-బాడీ చికిత్స నిలిచిపోయినట్టు తెలిసి ఆశ్చర్యపోయా.. ఎందుకంటే తొలి రెండు దశల్లోనూ ఎటువంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని అన్నారు.

Read Also: ఉద్ధవ్‌‌కు గవర్నర్ రాసిన లేఖపై దుమారం: ఇదేం భాష మోదీజీ.. శరద్ పవార్ లేఖాస్త్రం

స్వల్ప విరామం తర్వాత తిరిగి ప్రారంభమవుతాయని ఆశిస్తున్నాం.. దీని గురించి త్వరగా వివరాలను పొందుతామని, జాగ్రత్తగా ఉండటం మంచిది’ అని వ్యాఖ్యానించారు. ‘ఈ అధ్యయనంలో పాల్గొనే వాలంటీర్ల భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంలో డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డు (డీఎస్ఎంబీ) తీసుకున్న నిర్ణయానికి లిల్లీ మద్దతు ఇస్తుంది’అని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

Read Also: ఆగస్టు 5 నాటి అవమానం మరచిపోలేం.. ఆర్టికల్ 370 తిరిగి సాధిస్తాం: మెహబూబా

మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కోసం అమెరికా, డెన్మార్క్, సింగ్‌పూర్‌లలో 50కిపైగా ప్రాంతాల్లోని 10వేల మందిని క్లినికల్ ట్రయల్స్‌లో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ఆగస్టులో అధ్యయనం ప్రారంభించింది. ఇదిలా ఉండగా.. అత్యవసర వినియోగం కింద ఎఫ్‌డీఏకి లిల్లీతో పాటు రెజెనెరొన్‌లు గతవారం దరఖాస్తు చేశాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.