బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు ఉత్సవాలు జరుపుకొంటున్నారు. మే నెలలో వచ్చే పౌర్ణమి రోజును బౌద్ధులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. వారు దీన్ని ‘వెసాక్’గా వ్యవహరిస్తారు. క్రీ.పూ. 623లో ఇదే రోజున బుద్ధుడు జన్మించాడు. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన రోజు కూడా ఇదే. ఇంతటి విశిష్టత ఉన్న ఈ రోజును ‘అంతర్జాతీయ వెసాక్ దినోత్సవం’గా ఐక్యరాజ్య సమితి 1999లో ప్రకటించింది. నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు.
భారత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. బుద్ధ పూర్ణిమ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన బుద్ధ శిల్పాన్ని ఇసుకతో రూపొందించారు. కొలంబో సముద్ర తీరం ఈ ఘట్టానికి వేదిక అయింది. కొలంబోలో బౌద్ధ ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన 14వ ఇంటర్నేషనల్ వెసాక్ డే సందర్భంగా ఈ సైకత శిల్పాన్ని రూపొందించినట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. దీంతో పాటు బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు కూడా తెలిపారు.
#HappyBuddhaPunima My SandArt on Lord #Buddha in 14th #InternationalVesakDay Celebrations at #Colombo, #SriLanka. pic.twitter.com/fUSPAqX3r9 — Sudarsan Pattnaik (@sudarsansand) May 10, 2017
భారత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. బుద్ధ పూర్ణిమ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన బుద్ధ శిల్పాన్ని ఇసుకతో రూపొందించారు. కొలంబో సముద్ర తీరం ఈ ఘట్టానికి వేదిక అయింది. కొలంబోలో బౌద్ధ ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన 14వ ఇంటర్నేషనల్ వెసాక్ డే సందర్భంగా ఈ సైకత శిల్పాన్ని రూపొందించినట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. దీంతో పాటు బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు కూడా తెలిపారు.
#HappyBuddhaPunima My SandArt on Lord #Buddha in 14th #InternationalVesakDay Celebrations at #Colombo, #SriLanka. pic.twitter.com/fUSPAqX3r9 — Sudarsan Pattnaik (@sudarsansand) May 10, 2017