యాప్నగరం

శ్రీనివాస్ మృతికి యూఎస్ కాంగ్రెస్‌లో సంతాపం

ఎట్టకేలకు కాన్సాస్‌లోని జాత్యాంహకార దాడిపై ట్రంప్ మాట్లాడారు.

TNN 1 Mar 2017, 9:58 am
ఎట్టకేలకు కాన్సాస్ లోని జాత్యాంహకార దాడిపై ట్రంప్ మాట్లాడారు. యూఎస్ కాంగ్రెస్ లో ఆయన కాన్సాస్ ఘటనను ఖండించారు. ఈ సందర్భంగా యూఎస్ కాంగ్రెస్ శ్రీనివాస్ కూచిభొట్ల మృతికి నిమిషం పాటు మౌనం వహించి సంతాపం ప్రకటించింది. శ్రీనివాస్ హత్య జాత్యంహకార దాడిగానే యూఎస్ కాంగ్రెస్ అభివర్ణించింది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ... యూదులపైన జరుగుతున్న దాడులను, కాన్సాస్ ఘటనను అందరూ ఖండించాలని అన్నారు. తమ మొదటి ప్రాధాన్యం అమెరికా ప్రజలకేనని, వారి ప్రయోజనాలే తనకు ముఖ్యమని తెగేసి చెప్పారు. వారితోనే అమెరికాకు మళ్లీ పూర్వవైభవం తేవడం కుదురుతుందని అన్నారు. ఉద్యోగాలను తిరిగి దేశ వాసులకే తెస్తానని అన్నారు. ఒబామా పాలన వల్ల దేశంలో ఉగ్రవాదం బాగా పెరిగిపోయిందని, తాను అమెరికాలో ఉగ్రచర్యలను అస్సలు భరించనని చెప్పారు.
Samayam Telugu at last trump condemn kansas shooting at us congress meet
శ్రీనివాస్ మృతికి యూఎస్ కాంగ్రెస్‌లో సంతాపం


ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ విధానం వల్ల అమెరికా పౌరులపై పన్నుల భారం బాగా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తన ప్రభుత్వం మార్పులు చేస్తోందని చెప్పారు. నెల రోజుల తన పాలనను తానే తెగ మెచ్చుకున్నారు ట్రంప్. తాను అద్భుతంగా పనిచేస్తున్నానని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్టాక్ మార్కెట్లు బాగా పుంజుకుంటున్నాయని పేర్కొన్నారు. లాబీయిస్టులను రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నామని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.