యాప్నగరం

కాబూల్‌లో పేలిన కారు బాంబు.. 10 మంది మృతి

అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘని తాలిబన్లతో శాంతి ఒప్పందాన్ని చేసుకుంటానని చెప్పిన నేపథ్యంలోనే బాంబు దాడి జరగడం గమనార్హం.

Samayam Telugu 29 Nov 2018, 3:16 pm
అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి విధ్వసం సృష్టించారు. రు. కాబూల్‌లోని బ్రిటీష్‌ రక్షణ సంస్థకు చెందిన జీ4ఎస్ శిబిరం సమీపంలో కారు బాంబు పేలిన ఘనటలో 10 మందికి పైగా దుర్మరణం చెందగా, మరో 20 మంది గాయపడ్డారు. దాడి ఘటనపై గురువారం అఫ్గాన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి నజీబ్‌ దానీశ్‌ మీడియాతో మాట్లాడారు. బాంబు దాడి జరిగిన వెంటనే తుపాకీ కాల్పుల మోత వినిపించిందని స్థానికులు చెబుతున్నారు.
Samayam Telugu Kabul


కారు బాంబు దాడి జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని కాబూల్‌ పోలీసు అధికారి బసీర్‌ ముజాహిద్‌ తెలిపారు. దాడికి పాల్పడ్డింది తామేనని ఏ ఉగ్రసంస్థ ప్రకటన చేయలేదని, అయితే తాలిబన్‌ ఉగ్రవాదులు ఈ విధ్వంసానికి కారణమై ఉండొచ్చునని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు.

కాగా, ఐక్యరాజ్యసమితి జెనీవాలో నిర్వహించిన సమావేశంలో అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘని తాలిబన్లతో శాంతి ఒప్పందాన్ని చేసుకుంటానని చెప్పిన నేపథ్యంలోనే బుధవారం బాంబుదాడి జరగడం గమనార్హం. గత 24 గంటల నుంచి హెల్మాండ్‌ సరిహద్దు ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో 30 మంది పౌరులు, 16 మంది తాలిబన్ సాయుధులు చనిపోయారని అధికారులు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.