యాప్నగరం

విషాదంగా మారిన విహారయాత్ర.. పడవ బోల్తాపడి 10 మందికిపైగా విద్యార్థులు మృ తి

పొరుగు దేశం పాకిస్థాన్‌లో ఆదివారం రెండు ఘోర ప్రమాదాలు సంభవించి మొత్తం 59 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. బలూచిస్థాన్‌ ప్రావిన్సుల్లోని లస్బెలా ప్రాంతంలో 48 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు యూటర్న్‌ తీసుకుంటున్న క్రమంలో వంతెన స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో 42 మంది చనిపోగా.. పడవ బోల్తాపడి 10 మంది విద్యార్థులు చనిపోయారు. విహార యాత్రలో ఈ ఘటన జరిగింది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 30 Jan 2023, 10:22 am

ప్రధానాంశాలు:

  • డ్యామ్‌ వద్దకు పిక్‌నిక్‌కు వెళ్లిన విద్యార్థులు
  • పడవలో విహారం చేస్తుండగా ప్రమాదం
  • యూటర్న్ చేస్తుండగా స్తంభాన్ని ఢీకొట్టిన బస్సు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Boat Capsizes
పాకిస్థాన్‌లో ఘోర పడవ ప్రమాదం చోటుచోసుకుంది. ఖైబర్ పక్తున్‌ఖ్వాలోని టాండా దామ్ సరస్సులో ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులు మంది ప్రాణాలు కోల్పోయారు. సరస్సులో విహార యాత్రకు వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయానికి పడవలో 30 మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. మిగతావారిని రక్షించినట్టు చెప్పారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన విద్యార్థులంతా ఓ మదర్సాలో విద్యాభ్యాసం చేస్తున్నారని, వీరంతా 12 నుంచి 20 ఏళ్లలోపు వారేనని పేర్కొన్నారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 40 మందికిపైగా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కొహాట్‌ జిల్లాలోని టండా డ్యాంలో పడవ ప్రమాదం చోటుచేసుకుని ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులు మృతిచెందారని, మరో 13మందికి గాయాలు అయ్యాయి. ‘‘పడవలో 30 మంది ప్రయాణిస్తున్నారు. 10 మంది మృతదేహాలను బయటకుతీశాం.. 17 మందిని రక్షించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాం.. విద్యార్థులందరూ 12 నుంచి 20 ఏళ్లలోపు వయసువారే’’ అని డిప్యూటీ కమిషనర్‌ ఫుర్కాన్‌ అష్రఫ్‌ తెలిపారు.
ఈ ఘటనపై ఖైబర్ పక్తున్‌ఖ్వా ముఖ్యమంత్రి అజమ్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించి, వీలైనంత త్వరగా సహాయక చర్యలు చేపట్టి.. చిన్నారుల ప్రాణాలను కాపాడాలని అధికారులను ఆదేశించారు. పాక్‌లో పడవ ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. గతేడాది జులైలో సింధు నదిలో పడవ బోల్తాపడి 19 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు, బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని లస్బెలా ప్రాంతంలో 48 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు యూటర్న్‌ తీసుకుంటున్న క్రమంలో వంతెన స్తంభాన్ని ఢీ కొట్టింది. అనంతరం లోయలో పడ్డ బస్సుకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 42 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మిగతావారి పరిస్థితి విషమంగా ఉంది. ఓ చిన్నారి, మహిళతో పాటు మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. మరణించిన వారిని గుర్తించడానికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read Latest International News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.